తెలంగాణ

telangana

ETV Bharat / bharat

200 మంది కేరళ విద్యార్థులకు కరోనా! - కర్ణాటక కరోనా వార్తలు

కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్నత విద్యను అభ్యసిస్తోన్న 200 మందికి పైగా కేరళ విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. అయితే ఇది కొత్త రకం వైరస్​ అనే అనుమానం ఆందోళన కలిగిస్తోంది.

More than 200 Kerala students in Mangaluru tests positive for coronavirus till now!
అక్కడ 200 మంది కేరళ విద్యార్థులకు కరోనా!

By

Published : Feb 10, 2021, 9:02 AM IST

కర్ణాటక మంగళూరు నగరంలో చదువుతోన్న 200 మందికి పైగా కేరళ విద్యార్థులకు కరోనా నిర్ధరణ అయింది. ముందు జాగ్రత్త చర్యగా వీరందరి నమూనాలను బెంగళూరులోని నిమ్హాన్స్ ఆసుపత్రికి తరలించారు. ఇది కొత్తరకం కరోనానో కాదో తేలాల్సి ఉంది.

స్ట్రెయిన్​ కేసులు..

ఇటీవల ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చిన కొందరిలో కొత్తరకం కరోనా (స్ట్రెయిన్) వెలుగుచూసింది. బ్రిటన్ నుంచి కేరళకు వచ్చిన ప్రయాణికుల్లోనూ ఈ వైరస్​ను కనుగొన్నారు. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు.

ఇదీ చదవండి:'25శాతం ఆరోగ్య సిబ్బందిలో యాంటీబాడీలు'

ABOUT THE AUTHOR

...view details