తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భాజపాలో చేరిన 1500 మంది కాంగ్రెస్​ కార్యకర్తలు - గుజరాత్​లో స్థానికలు

గుజరాత్​లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్​కు ఆ పార్టీ కార్యకర్తలు భారీ షాక్​ ఇచ్చారు. ఒకే గ్రామానికి చెందిన సుమారు 1500 మంది భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

More than 1500 Congress workers from Anand district join BJP
భాజపాలో చేరిన 1500 మంది కాంగ్రెస్​ కార్యకర్తలు

By

Published : Feb 1, 2021, 5:13 AM IST

రాబోయే పంచాయతీ ఎన్నికలతో గుజరాత్​లో రాజకీయం వేడెక్కుతోంది. ఇప్పటికే ఆయా పార్టీలు స్థానిక ఎన్నికల్లో గెలిచి పార్టీల బలం నిలుపుకోవాలని చూస్తూన్న తరుణంలో కాంగ్రెస్​కు గట్టి దెబ్బ తగిలింది. ఆనంద్ జిల్లాలోని ఖండలి గ్రామానికి చెందిన 1500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు భాజపా జిల్లా ఇంఛార్జి జయద్రాత్ సింగ్ పర్మార్ సమక్షంలో కమలం పార్టీలో చేరారు.

భాజపాలో చేరిన 1500 మంది కాంగ్రెస్​ కార్యకర్తలు
భాజపాలో చేరిన 1500 మంది కాంగ్రెస్​ కార్యకర్తలు

కాంగ్రెస్ పార్టీకి బలమైన నేతగా ఉన్న భరత్ సోలంకి, ఖండలి సర్పంచ్, ఆనంద్ జిల్లా పంచాయతీ నిర్మాణ కమిటీ ఛైర్మన్ రాజేంద్రసింహ్ గోహిల్​లు కాంగ్రెస్​ను వీడిన ముఖ్యనేతల్లో ఉన్నారు.

"కాంగ్రెస్ కార్మికులను నిర్లక్ష్యం చేసింది. దీంతో పార్టీ మారడం అనివార్యం అయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధిని చేసి చూపించారు. భాజపా భావజాలంతో ఏకీభవించి మేము పార్టీ మారాం. ఇటీవల అమూల్​ డైరీ ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి మాకు అన్యాయం జరిగింది."

-భరత్​ సోలంకి

ఇదీ చూడండి: 'రాహుల్​కు పార్టీ పగ్గాలు అప్పగించండి'

ABOUT THE AUTHOR

...view details