వందే భారత్ మిషన్ ద్వారా ఇప్పటి వరకు 15 లక్షలకుపైగా భారతీయులను వివిధ మార్గాల ద్వారా స్వదేశానికి చేర్చినట్లు తెలిపారు పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ. విదేశాల్లో చిక్కుకున్న వారి కోసం వందే భారత్ అంతర్జాతీయ విమానాల సేవలు కొనసాగుతాయని వెల్లడించారు. కేవలం విమానాల ద్వారానే 4.5 లక్షలమందికిపైగా భారత్కు తీసుకొచ్చినట్లు చెప్పారు.
'వందే భారత్'తో స్వదేశానికి చేరిన 15 లక్షల మంది - Union Civil Aviation Minister, Hardeep Singh Puri
వందే భారత్ మిషన్లో భాగంగా వివిధ మార్గాల ద్వారా విదేశాల్లో చిక్కుకున్న15 లక్షలకుపైగా మందిని భారత్కు చేర్చినట్లు తెలిపింది పౌరవిమానయాన శాఖ. విదేశాల్లో చిక్కుకున్న వారి కోసం అంతర్జాతీయ విమానాల సేవలు కొనసాగుతాయని వెల్లడించింది.
!['వందే భారత్'తో స్వదేశానికి చేరిన 15 లక్షల మంది vande bharat mission](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8696399-111-8696399-1599345812718.jpg)
'వందే భారత్'తో స్వదేశానికి చేరిన 15 లక్షల మంది
కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చిక్కుకుపోయిన వారిని భారత్కు తీసుకొచ్చేందుకు మే 7న ఈ మిషన్ ప్రారంభించింది కేంద్రం. వందే భారత్లో భాగంగా అమెరికా, కెనడా, బ్రిటన్ వంటి 40కిపైగా దేశాలతో ఎయిర్ బబుల్ ఒప్పందం చేసుకుని.. ద్వైపాక్షిక ఒప్పందాల సాయంతో నిబంధనల మేరకు భారతీయులను తరలింపు చేపట్టింది.
ఇదీ చూడండి: 'బుల్లెట్' ఎప్పుడనేది ఇప్పుడే చెప్పలేం!
Last Updated : Sep 6, 2020, 9:51 AM IST