తెలంగాణ

telangana

By

Published : Mar 26, 2019, 8:20 PM IST

ETV Bharat / bharat

సీనియర్లను మోదీ అవమానించారు : కేజ్రివాల్​

సీనియర్​ నేతలు ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషిలను ప్రధాని నరేంద్రమోదీ అవమానించారని దిల్లీ సీఎం కేజ్రివాల్​ విమర్శించారు. లోక్​సభ ఎన్నికల్లో అగ్రనేతలకు టికెట్​ నిరాకరించడం దారుణమని దుయ్యబట్టారు.

మోదీ సీనియర్లను దారుణంగా అవమానించాడు:కేజ్రీవాల్​

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శల వర్షం కురిపించారుఆమ్​ఆద్మీ పార్టీ అధ్యక్షుడు, దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రివాల్. సీనియర్​ నాయకులైన ఎల్​కే అడ్వాణీ, మురళీ మనోహర్​ జోషిలను లోక్​సభ ఎన్నికల్లో పోటీకి దూరం పెట్టి అవమానించారని ట్వీట్​ చేశారు.

పెద్దలను గౌరవించాలని చెప్పే హిందూ సంప్రదాయాలకు మోదీ వ్యతిరేకమని ట్విట్టర్​ వేదికగా వ్యాఖ్యానించారు కేజ్రివాల్. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్​ను మోదీ ఎందుకు అవమానిస్తున్నారని ప్రజలు మాట్లాడుకుంటున్నారని అన్నారు.

"ఇంటిని నిర్మించిన పెద్దలను తోసేశారు. వారినే గౌరవించని మోదీ ఇంక ఎవరిని కాపాడుతారు?- ట్విట్టర్​లో అరవింద్​ కేజ్రివాల్​.

దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రివాల్​ ట్వీట్​

ABOUT THE AUTHOR

...view details