రైలు ప్రమాదంలో చేతులను కోల్పోయిన మోనికా మోరే అనే యువతికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించిన ముంబయి వైద్యులు.. బాధితురాలిని డిశ్చార్జి చేశారు.
2014లో జరిగిన రైలు ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయింది మోనిక. ఆ ప్రమాదం తర్వాత కృత్రిమ చేతులను అమర్చారు వైద్యులు. అనంతరం బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి చేతులను చెన్నై నుంచి ముంబయికి తీసుకొచ్చి యువతికి అమర్చారు. నెల రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచిన తర్వాత శనివారం డిశ్చార్జి చేశారు.