తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మోదీ-ట్రంప్​ చర్చలు అంచనాలు అందుకోలేదు' - 'భారత్​ అంచనాలను అందుకోని మోదీ-ట్రంప్​ చర్చలు'

ప్రధాని అమెరికా పర్యటనపై విమర్శల వర్షం కురిపించింది కాంగ్రెస్​. మోదీ-ట్రంప్​ చర్చలు భారతీయుల అంచనాలను అందుకోలేకపోయాయని మండిపడింది. ఇక ప్రజల కష్టాలపై దృష్టి పెట్టాలని ప్రధానికి సూచించింది.

'భారత్​ అంచనాలను అందుకోని మోదీ-ట్రంప్​ చర్చలు'

By

Published : Sep 30, 2019, 5:15 AM IST

Updated : Oct 2, 2019, 1:13 PM IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనతో దేశానికి ఒనగూరిందేమీ లేదని కాంగ్రెస్​ ఆరోపించింది​. మోదీ- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చర్చలు భారతీయుల అంచనాలను అందుకోలేకపోయాయని విమర్శలు సంధించింది. 'హౌడీ-మోదీ' ద్వారా తమ స్నేహాన్ని ప్రపంచానికి చాటిచెప్పినా ఫలితం దక్కలేదని ఎద్దేవా చేసింది.

మోదీ ఐరాస ప్రసంగంలో ఆనందపడాల్సిన అంశమేమీ లేదని సీనియర్​ కాంగ్రెస్​ నేత ఆనంద్​ శర్మ అభిప్రాయపడ్డారు. ఇక ప్రజల కష్టాలపై దృష్టి సారించాలని ప్రధానికి సూచించారు ఆనంద్​ శర్మ.

"మోదీ పర్యటనపై భాజపా సంబరాలు జరుపుకుంటోంది. కానీ ఆ సంబరాలకు సరైనా కారణాలు లేవు. మోదీ పర్యటనలో ఆశించిన ఫలితాలు దక్కలేదు. భారత్​కు జీఎస్​పీ హోదా పునరుద్ధరించేలా ట్రంప్​ను ఒప్పించడంలో మోదీ విఫలమయ్యారు. హెచ్​-1బీ వీసాల తగ్గింపు నిర్ణయాన్ని ఉపసంహరించ లేకపోయారు."
--- ఆనంద్​ శర్మ, కాంగ్రెస్
సీనియర్​ నేత

వాణిజ్య ఒప్పందాన్ని పూర్తి చేయలేకపోవడం వల్ల భారత పరిశ్రమలు తీవ్ర నిరాశ చెందాయని ఆరోపించారు ఆనంద్​ శర్మ.

అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పాకిస్థాన్​తో చేస్తోన్న పోరాటంపై మాత్రం ప్రభుత్వానికి పూర్తిగా మద్దతిస్తున్నామని కాంగ్రెస్​ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో కశ్మీర్​పై పాక్​ ప్రధాని ఇమ్రాన్​ఖాన్​ చేసిన విద్వేష ప్రసంగాన్ని ఖండించారు ఆనంద్​ శర్మ.

Last Updated : Oct 2, 2019, 1:13 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details