తెలంగాణ

telangana

'మహా'గడ్డపై మోదీ ర్యాలీ- మరోసారి అధికారమే లక్ష్యం

By

Published : Oct 13, 2019, 5:11 AM IST

Updated : Oct 13, 2019, 10:07 AM IST

నేడు మహారాష్ట్రలో పర్యటించనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. జల్​గావ్, సకోలీల్లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మరోసారి ఫడణవీస్​ ప్రభుత్వానికి అధికారం అప్పగించాలని ఓటర్లను అభ్యర్థించనున్నారు.

'మహా'పోరులో మోదీ ర్యాలీ- మరోసారి అధికారమే లక్ష్యం

'మహా'గడ్డపై మోదీ ర్యాలీ- మరోసారి అధికారమే లక్ష్యం

మహారాష్ట్రలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారానికి సర్వం సిద్ధమైంది. నేడు రాష్ట్రంలోని జల్​గావ్​, సకోలీలో ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నట్టు ట్వీట్​ చేశారు మోదీ.

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ రాష్ట్రాభివృద్ధికి​ ఎంతో శ్రమించారని... మరోసారి ఆయన ప్రభుత్వానికే అధికారం అప్పగించాలని ప్రజలను కోరనున్నారు మోదీ.

"మహారాష్ట్రలో ప్రచారం చేస్తాను. జల్​గావ్, సకోలీ బహిరంగ సభల్లో పాల్గొంటాను. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ నేతృత్వంలో రాష్ట్రంలో సాధించిన అభివృద్ధిని ప్రచారాస్త్రంగా చేసుకుని ఎన్​డీఏ కూటమి.. ప్రజల వద్దకు వెళుతోంది. మరో ఐదేళ్ల పాటు అధికారాన్ని అప్పగించాలని కోరుతున్నాం."
- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

288 శాసనసభ సీట్లున్న మహారాష్ట్రలో భాజపా 164 సీట్లలో పోటీ చేయనుంది. ఒప్పందం ప్రకారం మిత్రపక్షమైన శివసేనాకు 124 సీట్లు అప్పగించింది.

అక్టోబర్ 21న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 24న ఫలితాలు వెలువడతాయి.

ఇదీ చూడండి:- చెన్నై టూ చైనా: 'మోదీ- జిన్​పింగ్​ చర్చలు ఫలప్రదం'

Last Updated : Oct 13, 2019, 10:07 AM IST

ABOUT THE AUTHOR

...view details