తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బ్రిటన్​ ప్రధాని బోరిస్​తో మోదీ ఫోన్​ సంభాషణ

బ్రిటన్​ నూతన ప్రధాని బోరిస్​ జాన్సన్​తో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్లో సంభాషించారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినందుకు పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.

By

Published : Aug 20, 2019, 11:24 PM IST

Updated : Sep 27, 2019, 5:17 PM IST

బోరిస్​తో మోదీ

బ్రిటన్​ ప్రధానిగా ఇటీవల ఎన్నికైన బోరిస్​ జాన్సన్​కు భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు. తాజా పరిణామాలపై చర్చించేందుకు బోరిస్​తో ఫోన్లో సంభాషించారు మోదీ. రెండో సారి భారత్​కు ప్రధానిగా ఎన్నికైన మోదీకి కూడా బోరిస్​ శుభాకాంక్షలు చెప్పారు.

చర్చలో భాగంగా చాలా అంశాలపై ఇద్దరు నేతలు మాట్లాడినట్లు భారత ప్రధాని కార్యాలయం తెలిపింది. ఆగస్టు 15న లండన్​లో స్వాతంత్ర్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్న భారతీయులపై దాడిని బోరిస్​తో ప్రస్తావించారు మోదీ. ఈ హింసాత్మక ఘటనపై బోరిస్​ స్పందన కోరారు మోదీ.

ఈ ఘటనపై బోరిస్​ విచారం వ్యక్తం చేశారు. భారత హైకమిషన్, అందులోని అధికారులు, పర్యటకులకు పూర్తి భద్రత కల్పిస్తామని మోదీ హామీ ఇచ్చారు.

Last Updated : Sep 27, 2019, 5:17 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details