ట్రంప్తో ఫోన్లో సంభాషించిన మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో సంభాషించారు ప్రధాని నరేంద్ర మోదీ. దాదాపు 30 నిమిషాల పాటు ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలను చర్చించినట్లు ట్వీట్ చేశారు మోదీ.
ట్రంప్తో ఫోన్లో సంభాషించిన మోదీ
ఆర్టికల్ 370 రద్దు అనంతర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ....అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడారు. దాదాపు 30 నిమిషాలపాటు సంభాషించారు. ఈ మేరకు ట్విట్ చేశారు ప్రధాని. ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలను చర్చించినట్లు చెప్పారు. ఈ సంభాషణ స్నేహపూర్వకంగా సాగినట్లు మోదీ తెలిపారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం నియంత్రణ, హింస, తీవ్రవాదం లేని వాతావరణం ఏర్పాటు ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావించినట్లు చెప్పారు.
Last Updated : Sep 27, 2019, 2:10 PM IST