తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహాత్మునికి మోదీ, సోనియా ఘన నివాళి

జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పలువురు నేతలు నివాళులు అర్పించారు. పార్లమెంట్​ సెంట్రల్​​ హాల్​లో బాపూ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.

By

Published : Oct 2, 2019, 1:11 PM IST

Updated : Oct 2, 2019, 9:09 PM IST

మహాత్మునికి మోదీ, సోనియా ఘన నివాళి

మహాత్మునికి మోదీ, సోనియా ఘన నివాళి

మహాత్మ గాంధీ 150వ జయంతి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. దిల్లీలోని పార్లమెంట్​ సెంట్రల్​ హాల్​లో గాంధీకి ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లా, కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​, భాజపా అగ్రనేత ఎల్​కే అడ్వాణీ సహా మరికొందరు మహాత్ముడికి అంజలి ఘటించారు. అనంతరం అక్కడ జరిగిన ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొన్నారు.

దేశ మాజీ ప్రధాని లాల్​బహదూర్​ శాస్త్రి 115వ జయంతి సందర్భంగా ప్రముఖులంతా అయన చిత్ర పటానికి పుష్పాంజలి ఘటించారు.

ఇదీ చూడండి : బాపూ జయంతి: రాహుల్ 'గాంధీ సందేశ్​ యాత్ర'

Last Updated : Oct 2, 2019, 9:09 PM IST

ABOUT THE AUTHOR

...view details