తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భద్రత' రగడ: మోదీ, షాపై కాంగ్రెస్​ ఆగ్రహం - గాంధీ కుటుంబానికి ఎస్​పీజీ భద్రత తొలగింపుపై కాంగ్రెస్ అభ్యంతరం

ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్​షా వ్యక్తిగత రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. మోదీ ప్రభుత్వం సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు ఎస్పీజీ భద్రతను తొలగించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

మోదీ, అమిత్​షావి వ్యక్తిగత రాజకీయ కక్షలు: కాంగ్రెస్​

By

Published : Nov 8, 2019, 8:08 PM IST

'భద్రత' రగడ: మోదీ, షాపై కాంగ్రెస్​ ఆగ్రహం

మోదీ ప్రభుత్వం... సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలకు ఎస్​పీజీ భద్రతను తొలగించడంపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​షా వ్యక్తిగత రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించింది.

మోదీ, అమిత్​షావి వ్యక్తిగత రాజకీయ కక్షలు: కాంగ్రెస్​

"ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్​షాలకు వ్యక్తిగత కక్షతో ప్రతీకారం తీర్చుకోవాలనే ధ్యాసతో ఏదీ కనిపించడం లేదు. వారికి చట్టం అంటే లెక్కలేదు, రాజ్యాంగంపై గౌరవం లేదు, ప్రజాతీర్పును పట్టించుకోరు. తమ రాజకీయ ప్రత్యర్థులపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఎంతటికైనా తెగిస్తారు." - రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ అధికార ప్రతినిధి

అమిత్​షాకు నిరసన సెగ

గాంధీలకు ఎస్​పీజీ భద్రతను తొలగించడంపై కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్​షా నివాసం ముందు నిరసన చేపట్టారు. వెంటనే గాంధీ కుటుంబానికి ఎస్పీజీ భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

సీఆర్​పీఎఫ్​ అధీనంలోకి

రాహుల్​కు ఎస్​పీజీ భద్రత తొలగించిన నేపథ్యంలో తుగ్లక్ లేన్​లోని ఆయన నివాసం - నెం.12 భద్రతను సీఆర్​పీఎఫ్ దళాలు చేపట్టాయి. జన్​పథ్​లోని సోనియా గాంధీ నివాసం భద్రతను కూడా సీఆర్​పీఎఫ్ తన అధీనంలోకి తీసుకుంది. ఇకపై గాంధీ కుటుంబసభ్యలకు సీఆర్​పీఎఫ్​ సిబ్బంది జెడ్​ ప్లస్ సెక్యూరిటీని అందజేయనుంది.

మోదీ భద్రతకు 3000 దళాలు

తాజా చర్యతో 3000 మంది భద్రతా సిబ్బంది ప్రధాని మోదీకి మాత్రమే కాపలా కాయనున్నారు.

ఉగ్రచర్యలకు గాంధీలు బలి

గాంధీ కుటుంబం నుంచి ఇప్పటి వరకు ఇద్దరు నేతలు భద్రతా వైఫల్యం కారణంగా అసువులు బాసారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ఆమె భద్రతా సిబ్బందే హత్య చేశారు. తరువాత మాజీ ప్రధాని రాజీవ్​గాంధీని ఎల్​టీటీఈ ఉగ్రవాదులు హత్య చేశారు. అప్పటి నుంచి ఆ కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రత కొనసాగుతోంది. తాజాగా దానిని మోదీ ప్రభుత్వం తొలగించింది.

ఇదీ చూడండి: మోదీ చేతులమీదుగా రేపు కర్తార్​పుర్ ప్రారంభం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details