తెలంగాణ

telangana

ETV Bharat / bharat

వర్తకులకు పూచీకత్తు లేని 50 లక్షల రుణం: మోదీ - దిల్లీ

వర్తకులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 లక్షల రుణాన్ని అందిస్తామని ప్రధానమంత్రి నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. దుకాణదారులకు పింఛను పథకాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.

వర్తక సంఘాలతో ప్రధాని నరేంద్రమోదీ

By

Published : Apr 20, 2019, 7:22 AM IST

వర్తక సంఘాలతో ప్రధాని నరేంద్రమోదీ

ఎన్నికల వేళ వాణిజ్య వర్గాల మెప్పు కోసం చిన్న వ్యాపారులకు హామీల వర్షం కురిపించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. వర్తకులకు పూచీకత్తు, క్రెడిట్​ కార్డు లేకుండా రూ. 50 లక్షల వరకు రుణాలను అందిస్తామన్నారు. అలాగే చిన్న దుకాణ దారులకు పింఛను పథకాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

దిల్లీలోని తాల్కాతోరా మైదానంలో వర్తక సంఘాలతో సమావేశయ్యారు మోదీ.

"భారత ఆర్థిక వ్యవస్థకు వ్యాపారులే వెన్నెముక. మళ్లీ మోదీ ప్రభుత్వమే రానుంది. రాగానే.. 'రాష్ట్రీయ వ్యాపారి కల్యాణ్ మండలి'ని ఏర్పాటు చేస్తాం. అలాగే రాష్ట్రీయ చిల్లర వర్తకుల నిధిని ప్రారంభిస్తాం. జీఎస్టీలో నమోదు చేసుకున్న వ్యాపారులకు రూ.10లక్షల ప్రమాద బీమా అందిస్తాం. చిన్న దుకాణ దారులకు పింఛను పథకాన్ని తీసుకొస్తాం. స్టార్టప్​ రంగంలో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.50 లక్షల రుణాలను ఇచ్చేందుకు కొత్త పథకాన్ని తీసుకొస్తాం."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

దొంగలని కాంగ్రెస్ అంటోంది

మోదీ ప్రభుత్వం వర్తకుల వైపు నిలబడిందని ప్రధాని ఉద్ఘాటించారు. 70 ఏళ్లు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ మాత్రం వ్యాపారులను దొంగలని పిలుస్తోందని ఆరోపించారు. వ్యాపారుల సంక్షేమం కోసం ఐదేళ్లలో చాలా నిబంధనలను సులభతరం చేశామన్నారు. జీఎస్టీని తీసుకొచ్చి తాము ఎలాంటి తప్పు చేయలేదని, 98 శాతం నిత్యవసర వస్తువులకు 18 శాతం మాత్రమే పన్ను రేటు ఉందని చెప్పారు.

ఇదీ చూడండి: భారత్​ భేరి: ఓటెవరికి... దేశానికా? నగరానికా??

ABOUT THE AUTHOR

...view details