తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'శ్రేష్ఠ భారత్'​ నిర్మాణానికి శక్తి పీఠాలు మార్గదర్శకాలు - pm modi says jagadguru viswaradhya gurukula

ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలోని జగద్గురు విశ్వారాధ్య గురుకుల శతాబ్ది ఉత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. విజ్ఞానాన్ని అందించడంలో శక్తి పీఠాల ప్రాముఖ్యంపై ప్రసంగించారు.

modi says Shakti Peethas Guidelines for the construction of Sree Bhagya Bharat
శ్రేష్ఠభారత్​ నిర్మాణానికి శక్తి పీఠాలు మార్గదర్శాలు

By

Published : Feb 16, 2020, 1:34 PM IST

Updated : Mar 1, 2020, 12:35 PM IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలో పర్యటించారు. జగద్గురు విశ్వారాధ్య గురుకుల శతాబ్ది ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వీరశైవం పరిఢవిల్లే కాశీలో గురుకుల శతాబ్ది ఉత్సవాలు జరగడం ఆనందంగా ఉందని చెప్పారు.

శక్తి పీఠాలు ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదని, 'శ్రేష్ఠ భారత్'​ నిర్మాణానికి మార్గదర్శకాలు అన్నారు మోదీ.

"శ్రేష్ఠభారత్​ నిర్మాణానికి శక్తి పీఠాలు మార్గదర్శకాలు"

"21వ శతాబ్దంలో భారత్ తన విజ్ఞానాన్ని ప్రపంచానికి చాటింది. పూర్వీకులు అందించిన జ్ఞానం వల్లే ఇది సాధ్యమైంది. అందుకు కృషి చేసిన శ్రీ జగద్గురు విశ్వారాధ్య గురుకులానికి కృతజ్ఞతలు.

జగద్గురు విశ్వారాధ్య గురుకుల శతాబ్ది ఉత్సవాలను నిర్వహించడాన్ని దేశంలోని అన్ని వర్గాల ప్రజలు అభినందిస్తున్నారు. భక్తతోనే ముక్తి లభిస్తుంది. "

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

అంతకుముందు... వారణాసి విమానాశ్రయంలో మోదీకి యూపీ గవర్నర్ ఆనందీబెన్​ పటేల్, సీఎం యోగి ఆదిత్య నాథ్​ స్వాగతం పలికారు. అనంతరం మోదీ జంగంవాడీ మఠాన్ని సందర్శించారు. అక్కడ పూజలు నిర్వహించి నేరుగా జగద్గురు విశ్వారాధ్య గురుకుల శతాబ్ది ఉత్సవాలకు హాజరయ్యారు.

Last Updated : Mar 1, 2020, 12:35 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details