ఉత్తర్ప్రదేశ్ ఔరయ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వలసకూలీల కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదాన్ని ఓ ఘోర దుర్ఘటనగా పేర్కొన్న ఆయన.. యూపీ సర్కార్ యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపడుతోందన్నారు.
"ఔరయ రోడ్డు ప్రమాదం చాలా విషాదకరం. ప్రభుత్వం సహాయక చర్యలు చేపడుతోంది. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను."
-ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్
రాహుల్ గాంధీ... సంతాపం
ఔరయ రోడ్డు ప్రమాదంలో మరణించిన వలసకూలీల కుటుంబాలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.