తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మహా' భేటీ: ప్రధాని మోదీతో శరద్ పవార్​ సమావేశం - pawar latest news

మరికాసేపట్లో మోదీ-పవార్ 'మహా' భేటీ..

By

Published : Nov 20, 2019, 12:16 PM IST

Updated : Nov 20, 2019, 2:17 PM IST

14:16 November 20

ప్రధానికి పవార్​ మూడు పేజీల లేఖ

  • ప్రధానితో ముగిసిన శరద్‌పవార్‌ భేటీ
  • అరగంట పాటు జరిగిన మోదీ- శరద్‌ పవార్‌ భేటీ
  • రైతు సమస్యలపై ప్రధానికి 3 పేజీల లేఖ ఇచ్చిన శరద్ పవార్
  • వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరిన శరద్ పవార్
  • మహారాష్ట్రలో 54 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని మోదీకి వివరించిన పవార్
  • మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన ఉన్నందున కేంద్రం జోక్యం చేసుకోవాలన్న పవార్‌
  • మహారాష్ట్రలో కేంద్రం తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని వినతి

12:34 November 20

మోదీతో పవార్ భేటీ

ప్రధాని నరేంద్ర మోదీతో ఎన్సీపీ అధినేత శరద్​ పవార్ భేటీ అయ్యారు. పార్లమెంటులోని ప్రధాని ఛాంబర్​లో మోదీని కలిశారు పవార్. మహారాష్ట్రలో రాజకీయ ప్రతిష్టంభన నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే... రైతు సమస్యలపై చర్చించేందుకే మోదీని పవార్ కలిశారని చెప్పారు ఎన్సీపీ నేతలు.

12:01 November 20

మరికాసేపట్లో మోదీ-పవార్ 'మహా' భేటీ..

ప్రధాని నరేంద్రమోదీతో పార్లమెంటులో భేటీ కానున్నారు ఎన్సీపీ అధినేత శరద్​ పవార్​.  మహారాష్ట్ర  పరిణామాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం సంతరించుకుంది.  రైతుల సమస్యపై  చర్చించేందుకే మోదీని పవార్​ కలుస్తున్నారని శివసేన తెలిపింది.

Last Updated : Nov 20, 2019, 2:17 PM IST

ABOUT THE AUTHOR

...view details