తెలంగాణ

telangana

'నూతన దిశ-నవీన శక్తితో చైనాతో మైత్రి'

చైనాతో భారత సంబంధాలు నూతన దిశ- నవీన శక్తితో ముందుకు సాగుతున్నాయని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. బ్రెజిల్​లో జరుగుతున్న బ్రిక్స్ 11వ శిఖరాగ్ర సదస్సు వేదికగా చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​తో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గతనెలలో జరిగిన ఇరునేతల అనధికారిక భేటీని గుర్తు చేశారు మోదీ.

By

Published : Nov 14, 2019, 6:14 AM IST

Published : Nov 14, 2019, 6:14 AM IST

'నూతన దిశ-నవీన శక్తితో చైనాతో మైత్రి'

బ్రిక్స్​ శిఖరాగ్ర సదస్సు వేదికగా చైనా అధ్యక్షుడు షి జిన్​పింగ్​తో భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. ఇరుదేశాల మధ్య మైత్రి నూతన దిశ-నవీన శక్తితో సాగుతోందని అభిప్రాయపడ్డారు. నెల వ్యవధిలోనే జిన్​పింగ్​ను మరోసారి భేటీ కావడం సంతోషంగా ఉందన్నారు. చెన్నై వేదికగా జరిగిన అనధికారిక సమావేశం ఇరుదేశాల సంబంధాల్లో నూతన శకానికి నాంది పలికిందన్నారు మోదీ.

'నూతన దిశ-నవీన శక్తితో చైనాతో మైత్రి'

"చెన్నైలో మన భేటీ ద్వారా నవోత్సాహం వచ్చింది. ఏ ఎజెండా లేకుండా జరిగిన నాటి భేటీలో ఇరుదేశాల సంస్కృతులు, అలవాట్లు సహా పరస్పరం అర్థం చేసుకోవడానికి అవకాశం కలిగింది. ఆ భేటీ ఎంతో సత్ఫలితాలనిచ్చింది. చెన్నై సమావేశంలో చర్చించిన ద్వైపాక్షిక వాణిజ్య అంశాలు ఆచరణలోకి వస్తే ఇరు దేశాలకు సంబంధించి అనేక అంశాలు మరింత ముందుకు సాగుతాయి."

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరునేతలు విస్తృత చర్చలు జరిపారు. చైనా మద్దతిచ్చిన ఆర్​సెప్​ ఒప్పందానికి భారత్​ నిరాకరించిన అనంతరం ఇరునేతల మధ్య భేటీ జరగడం ఇదే తొలిసారి.

ఇదీ చూడండి: 'శబరిమల' వివాదమేంటి? సుప్రీం తీర్పు మారుతుందా?

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details