తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బిష్కెక్​లో మోదీ-ఇమ్రాన్​ సరదా సంభాషణ

బిష్కెక్​లో జరిగిన ఎస్​సీవో సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ.. పాకిస్థాన్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ మాట్లాడుకున్నారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇద్దరి మధ్య ఛలోక్తులతో కూడిన చిన్న సంభాషణ జరిగినట్లు సమాచారం.

By

Published : Jun 14, 2019, 11:06 PM IST

Updated : Jun 15, 2019, 12:32 AM IST

ఎస్​సీవో సదస్సులో మోదీ-ఇమ్రాన్​ సరదా సంభాషణ

బిష్కెక్​లో మోదీ-ఇమ్రాన్​ సరదా సంభాషణ

భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ మధ్య సరదా సంభాషణ జరిగినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. బిష్కెక్​లో జరిగిన ఎస్​సీవో సదస్సులో శుక్రవారం ఒకరినొకరు పలకరించుకుని ఛలోక్తులు కూడా విసురుకున్నట్లు సమాచారం.

ప్రధానిగా తిరిగి ఎన్నికైనందుకు మోదీకి ఇమ్రాన్​ శుభాకాంక్షలు తెలిపారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.

ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించేందుకు సిద్ధమని పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​, ఆ దేశ విదేశాంగ మంత్రి మహమూద్ ఖురేషీ భారత్​కు 2 వారాల క్రితమే లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో ఇరు దేశ ప్రధానుల మధ్య సంభాషణకు ప్రాధాన్యం సంతరించుకుంది.

2016 నుంచి చర్చల్లేవ్​..

పఠాన్​కోట్​లో 2016లో భారత బలగాల శిబిరాలపై పాక్​ దాడులు జరిపింది. అప్పటి నుంచి పాకిస్థాన్​తో ఎలాంటి చర్చలు జరపలేదు భారత ప్రభుత్వం. ఉగ్రవాద నిర్మూలనకు పాక్ చర్యలు చేపట్టేంత వరకు చర్చలు కుదరవని భారత్​ తేల్చి చెప్పింది.

కిర్గిస్థాన్​ రాజధాని బిష్కెక్​లో రెండు రోజుల పాటు ఎస్​సీవో సదస్సు జరిగింది. పాక్​ ప్రధాని సహా సభ్య దేశాల అధినేతలు హాజరయ్యారు. అంతర్జాతీయ భద్రతా పరిస్థితులు, బహుపాక్షిక ఆర్థిక సహకారం, పలు కీలక అంశాల అంశాలపై చర్చ జరిగింది.

దిల్లీ బయల్దేరిన మోదీ..

సదస్సులో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్​, అఫ్గానిస్థాన్​ అధ్యక్షుడు అష్రఫ్​​​ ఘనితో గురువారం సమావేశమయ్యారు మోదీ. కిర్గిస్థాన్​ అధ్యక్షుడు సూరోన్​బే జీన్​బెకొవ్​తో నేడు భేటీ అయ్యారు.

శుక్రవారం సదస్సు ముగిశాక దిల్లీ బయలు దేరారు మోదీ.

Last Updated : Jun 15, 2019, 12:32 AM IST

ABOUT THE AUTHOR

...view details