తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అభివృద్ధికి మారుపేరు మోదీ 2.0: అమిత్​షా

మోదీ 2.0 ప్రభుత్వానికి వంద రోజులు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మంత్రివర్గ సహచరులకు అభినందనలు తెలిపారు హోంమంత్రి అమిత్​షా. పేద ప్రజల సంక్షేమానికి, జాతీయ భద్రతకు ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ట్విట్టర్​లో వరుస పోస్టులు చేశారు.

By

Published : Sep 8, 2019, 12:23 PM IST

Updated : Sep 29, 2019, 9:03 PM IST

అభివృద్ధికి మారుపేరు మోదీ 2.0: అమిత్​షా

జాతీయ భద్రత, అభివృద్ధికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం మారుపేరని ఉద్ఘాటించారు కేంద్ర హోంమంత్రి అమిత్​షా. పేద ప్రజల సంక్షేమానికి కృషి చేస్తున్న ప్రభుత్వం అన్ని వర్గాలకు ఆశాజ్యోతి వంటిదని వ్యాఖ్యానించారు. మోదీ 2.0 ప్రభుత్వానికి వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో అభినందనలు తెలుపుతూ వరుస ట్వీట్లు చేశారు అమిత్​ షా.

ఆర్టికల్ 370 రద్దు సహా 70 ఏళ్ల నుంచి ప్రతి భారతీయుడు వేచి చూస్తున్న కీలక, చారిత్రక నిర్ణయాలను మోదీ 2.0 ప్రభుత్వం తీసుకుందని గుర్తుచేశారు షా.

"ఆర్టికల్ 370, 35ఎ రద్దు, ముమ్మారు తలాక్​ నుంచి ముస్లిం మహిళలకు విముక్తి, యూఏపీఏ చట్టానికి సవరణ వంటి అనేక చారిత్రక నిర్ణయాలు మోదీ నాయకత్వం వల్లే జరిగాయి."

-అమిత్​షా, కేంద్ర హోమంత్రి

దేశ అభివృద్ధి, సంక్షేమం, భద్రత కోసం ఉన్న ఏ అవకాశాన్నీ మోదీ ప్రభుత్వం వదిలిపెట్టదని పేర్కొన్నారు అమిత్ షా.

అమిత్​షా ట్వీట్లు

ఇదీ చూడండి: అండర్​ వరల్డ్​ డాన్​లు,​ అగ్రనేతలు జెఠ్మలానీ క్లయింట్లే!

Last Updated : Sep 29, 2019, 9:03 PM IST

ABOUT THE AUTHOR

...view details