తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అఖండ విజయానికి చిహ్నంగా 'మోదీ దివస్​'' - మోదీ దివస్

లోక్​సభ ఎన్నికల్లో భాజపా అఖండ విజయానికి గుర్తుగా మే 23న 'మోదీ దివస్​' జరపాలని యోగా గురు బాబా రాందేవ్​ ప్రతిపాదించారు. విపక్షాలన్నీ ఏకమైనా ప్రధాని నరేంద్రమోదీ ఒంటరిగా పోరాడి గెలిచారని కీర్తించారు.

మోదీ దివస్​ జరపాల్సిందే: బాబా రాందేవ్​

By

Published : May 28, 2019, 6:26 AM IST

మోదీ దివస్​ జరపాల్సిందే: బాబా రాందేవ్​

సార్వత్రిక ఫలితాల విడుదల రోజు మే 23ను 'మోదీ దివస్​'గా ప్రకటించాలని యోగా గురు బాబా రాందేవ్​ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో భాజపా అఖండ విజయానికి గుర్తుగా ఈ వేడుకను నిర్వహించాలని ఆకాంక్షించారు.

"ఓ వైపు మహా కూటమి.. మరో వైపు ఒంటరిగా ప్రధాని నరేంద్రమోదీ. అయినా పోరాడి విజయం సాధించారు. కోట్లాది మంది ప్రజల విశ్వాసాన్ని మరోసారి గెలుచుకున్నారు. ఈ భారీ విజయానికి గుర్తుగా మే 23న మోదీ దివస్ లేదా లోక్​కల్యాణ్​ దివస్​గా ప్రకటించాలి.

గో రక్షకులు, దొంగ రవాణా చేస్తున్న వారి మధ్య ఘర్షణలు తగ్గాలంటే గో హత్యలను నిర్మూలించటమే ఏకైక మార్గం. గో హత్యలపై పూర్తిగా నిషేధం విధించాలి. మాంసం తినాలనుకుంటే ఇతర మార్గాలు ఎన్నో ఉన్నాయి."

- బాబా రాందేవ్​, పతంజలి సహ వ్యవస్థాపకుడు

ఇదీ చూడండి: కార్యకర్తల సంతోషమే మా జీవనమంత్రం: మోదీ

ABOUT THE AUTHOR

...view details