తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ధ్యానం ముగించిన ప్రధాని మోదీ...

ఉత్తరాఖండ్ కేదార్​నాథ్ ఆలయ రుద్రగుహలో శనివారం ప్రారంభించిన ధ్యానం నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ బయటకు వచ్చారు. అనంతరం బదరీనాథ్​ ఆలయాన్ని ప్రధాని సందర్శించనున్నారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం సాయంత్రం దిల్లీకి బయల్దేరనున్నారు.

By

Published : May 19, 2019, 8:23 AM IST

Updated : May 19, 2019, 9:03 AM IST

ధ్యానం ముగించిన మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు బదరీనాథ్​ ఆలయాన్ని సందర్శించనున్నారు. కేదార్​నాథ్​ ఆలయంలోని రుద్రగుహలో ధ్యానముద్ర ముగించుకున్న మోదీ.. నేడు బదరీనాథ్​లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. అక్కడినుంచి సాయంత్రం దిల్లీ బయల్దేరి వెళతారు.

ఎన్నికల ప్రచార పర్వం ముగియగానే ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లిపోయారు మోదీ. ఉత్తరాఖండ్​లోని పవిత్రస్థలం కేదార్​నాథ్​ను దర్శించుకున్నారు. అనంతరం రుద్రగుహకు వెళ్లిన ప్రధాని.. యోగ ముద్రలో ధ్యానం చేశారు.

ధ్యానం ముగించిన మోదీ
Last Updated : May 19, 2019, 9:03 AM IST

ABOUT THE AUTHOR

...view details