తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మిషన్​ శక్తి' విజయంపై మాజీ సారథుల హర్షం

మిషన్​ శక్తి విజయవంతం కావటంపై మాజీ ఇస్రో ఛైర్మన్ మాధవన్​ నాయర్​, డీఆర్​డీఓ మాజీ సారథి వీకే సారస్వత్​ హర్షం వ్యక్తం చేశారు.

By

Published : Mar 27, 2019, 6:22 PM IST

'మిషన్​ శక్తి' విజయంపై మాజీ సారథుల హర్షం

ఉపగ్రహ వ్యతిరేక సాంకేతికతను భారత్​ విజయవంతంగా పరీక్షించిన శాస్త్రవేత్తలను ఇస్రో మాజీ సారథి మాధవన్​ నాయర్​ అభినందించారు. ఏ-శాట్​... అణుబాంబు తరహాలో ఆత్మరక్షణ కోసమేనని, ఇతరులపై ఉపయోగించమని చెప్పారు. ఇస్రో మాజీ ఛైర్మన్ మాధవన్​ నాయర్​, ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబీ నారాయణన్, రక్షణ రంగ నిపుణులు మిషన్​ శక్తి విజయవంతంపై హర్షం వ్యక్తంచేశారు.

'మిషన్​ శక్తి' విజయంపై మాజీ సారథుల హర్షం

ఇది మహోన్నతమైనది. ఎందుకంటే మన ఉపగ్రహాలవైపు చూసేందుకు కూడా ఎవరూ ధైర్యం చేయరు. భారత ఉపగ్రహాలపై దాడికి ప్రయత్నం చేయరు. ఇది మన సామర్థ్యం అవుతుంది. ఈ ప్రయోగం ఏ దేశానికీ వ్యతిరేకంగా కాదు. ఈ ప్రయోగం దేశ సాంకేతిక సామర్థ్యాన్ని ఇనుమడింపజేయటానికి ఉద్దేశించినది మాత్రమే.
- వీకే సారస్వత్​, డీఆర్​డీఓ మాజీ ఛైర్మన్

ఇది భారత అంతరిక్ష, క్షిపణి చరిత్రలో మరో కీర్తిపతాకం. రాజకీయ చిత్తశుద్ధితో ఇలాంటి నిర్ణయం తీసుకొని, తక్కువ సమయంలోనే ప్రయోగించినందుకు ప్రధానమంత్రికి అభినందనలు.
- మాధవన్​ నాయర్​, ఇస్రో మాజీ ఛైర్మన్​

ఈ మిషన్​ కోసం చాలా కష్టపడ్డ ప్రతి ఒక్క శాస్త్రవేత్తను అభినందించాలి. ఇది దేశాన్ని మరో కొత్త పోటీలో నిలబెడుతుంది. ఇది ఎంతో ఆహ్వానించదగిన పరిణామం.
- ధృవ్​ కటోచ్​, రక్షణ రంగ నిపుణలు

ABOUT THE AUTHOR

...view details