తెలంగాణ

telangana

By

Published : Jun 23, 2020, 6:45 PM IST

Updated : Jun 23, 2020, 7:16 PM IST

ETV Bharat / bharat

పతంజలికి షాక్​- 'కరోనిల్​' ప్రకటనపై కేంద్రం గుస్సా

కరోనాకు ఆయుర్వేద మందు తీసుకువచ్చినట్లు ప్రకటించిన కాసేపటికే ప్రముఖ దేశీయ కంపెనీ పతంజలికి షాక్​ ఇచ్చింది కేంద్రం. ఆ డ్రగ్​పై అనుమానాలు లేవనెత్తుతూ... సంబంధిత వివరాలు సమర్పించాలని ఆదేశించింది. పూర్తిస్థాయిలో అనుమతి రాకుండా మీడియాలో ప్రకటనలను ప్రసారం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

Ministry of AYUSH in patanjali news
పతంజలి 'కరోనిల్​'పై కేంద్రం వివరణ

'కరోనిల్‌' పేరుతో కరోనాకు మందును మార్కెట్‌లోకి తీసుకువచ్చినట్లు ప్రకటించిన పతంజలి సంస్థకు షాకిచ్చింది ఆయుష్​ మంత్రిత్వశాఖ. కొవిడ్‌ ఔషధ అంశంలో పతంజలి ఆయుర్వేద్‌ లిమిటెడ్‌ వెంటనే వివరణ ఇవ్వాలని... వెంటనే ఔషధ అనుమతి పత్రాలను సమర్పించాలని కోరింది.

కరోనా చికిత్సకు ఆయుర్వేద మందు తీసుకొచ్చినట్లు మీడియాలో ప్రకటించడాన్ని తప్పుబట్టింది కేంద్రం. పూర్తి స్థాయిలో అనుమతులు వచ్చేవరకు మందులపై ప్రకటనలను నిలిపివేయాలని పతంజలికి సూచించింది.

ఇదీ చూడండి: ఫ్యాబిఫ్లూ టు కరోనిల్... ఏ మందు ఎవరికి?

Last Updated : Jun 23, 2020, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details