తెలంగాణ

telangana

'వలస కార్మికుల తరలింపులో చొరవ తీసుకోండి'

By

Published : May 15, 2020, 10:51 PM IST

లాక్​డౌన్​ కారణంగా ఇతర ప్రాంతాల్లో చిక్కుకుని సొంత రాష్ట్రాలకు చేరుకునేందుకు రైల్వే ట్రాకులు, రహదారుల వెంబడి వందల కిలో మీటర్లు నడుస్తున్నారు వలస కార్మికులు. వారిని గుర్తించి ఉచిత వసతి, భోజన సదుపాయాలు కల్పించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. చొరవ తీసుకోవాలని సూచించింది.

MHA asks states to provide food, shelter to migrant workers; ensure they board special trains
వలస కార్మికులను తరలించడంలో చొరవ తీసుకోండి: కేంద్ర హోంశాఖ

దేశంలో పలు ప్రాంతాల్లోని వలస కార్మికులు తమ స్వస్థలాలకు చేరడానికి ఎలాంటి ప్రమాదాలను లెక్క చేయడంలేదు. కాలినడకనే రైల్వే ట్రాక్​లు, రహదారుల వెంబడి వందల కిలోమీటర్ల కొద్దీ ప్రయాణం సాగిస్తున్నారు. వారిని గుర్తించి ఉచిత వసతి, భోజన సౌకర్యాలు కల్పించాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ.

చొరవ తీసుకోండి.

కేంద్ర ప్రభుత్వం వలస కార్మికుల కోసం శ్రామిక్​ రైళ్లు, బస్సులను ఏర్పాటు చేసినప్పటికీ కొందరు ఇంకా నడక సాగిస్తున్నారు. అలాంటి వారిని రైళ్లు, బస్సుల్లో తరలించాలని రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు సూచించారు హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా. సొంత రాష్ట్రాలకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్న వలస కార్మికులకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో రాష్ట్రాలు కూడా బాధ్యత వహించాలన్నారు.

ఇదీ చూడండి:రిక్షా బాలుడు: తల్లీదండ్రుల భారాన్ని.. వందల కి.మీ మోస్తూ..

ABOUT THE AUTHOR

...view details