తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'భారత్​, పాక్​లు రాజకీయ ఒత్తిళ్లను దాటి చర్చలు జరపాలి' - కాల్పుల విరమణ ఒప్పందం

భారత్​, పాకిస్థాన్​ నాయకత్వాలు తమ రాజకీయ ఒత్తిళ్లను దాటి సరిహద్దు సమస్యపై చర్చలు చేపట్టాలని కోరారు పీడీపీ అధినేత్రి మెహబూబా ముప్తీ. ఇరువైపులా ప్రాణనష్టం పెరగటం విచారకరమన్నారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని సూచించారు.

Mehabooba mufti
పీడీపీ అధినేత్రి మెహబూబా ముప్తీ

By

Published : Nov 14, 2020, 3:59 PM IST

సరిహద్దులో సమస్యలపై భారత్​, పాకిస్థాన్​లు తమ రాజకీయ ఒత్తిళ్లను దాటి చర్చలు చేపట్టాలని కోరారు పీపుల్స్​ డెమొక్రటిక్​ పార్టీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ. నియంత్రణ రేఖ(ఎల్​ఓసీ) వెంబడి ఇరువైపుల పెరుగుతున్న ప్రాణనష్టాన్ని చూడటం చాలా విచారకమన్నారు.

ఎల్​ఓసీ వెంబడి పాకిస్థాన్​ శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు పాల్పడగా.. భారత దళాలు దీటుగా సమాధానమిచ్చాయి. ఈ ఘటనల్లో ఇరువైపులా ప్రాణ నష్టం జరిగిన క్రమంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు ముఫ్తీ. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించాలని సూచిస్తూ ట్వీట్​ చేశారు.

" ఎల్​ఓసీ వెంబడి ఇరువైపులా ప్రాణనష్టం పెరగటం విచారకరం. భారత్​, పాకిస్థాన్​ నాయకత్వం వారి రాజకీయ ఒత్తిళ్లను దాటి ఆలోచిస్తేనే చర్చలు ప్రారంభమవుతాయి. మాజీ ప్రధాని వాజ్​పేయీ జీ, ముషారఫ్​ సాహబ్​ అంగీకరించి, అమలు చేసిన కాల్పుల విరమణను పునరుద్ధరించేందుకు ఇదే మంచి సమయం."

- మెహబూబా ముఫ్తీ, పీడీపీ అధినేత్రి.

ఇదీ చూడండి: భారత సేన సింహ గర్జనకు తోక ముడిచిన పాక్​ సైన్యం

ABOUT THE AUTHOR

...view details