తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రేపు సుప్రీంకు అయోధ్య మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక

అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టుకు మధ్యవర్తిత్వ కమిటీ రేపు నివేదిక సమర్పించనుంది. సుప్రీం రిజిస్ట్రార్​కు సీల్డ్​ కవర్​లో అందజేయనున్న నివేదికపై ఆగస్టు 2న అత్యున్నత న్యాయస్థానం విచారిస్తుంది.

By

Published : Jul 31, 2019, 8:03 PM IST

Updated : Aug 1, 2019, 12:17 AM IST

అయోధ్య మధ్యవర్తిత్వ కమిటీ నివేదక

అయోధ్య మధ్యవర్తిత్వ కమిటీ నివేదక

అయోధ్య భూవివాదం కేసులో మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక రేపు అందివ్వనుంది. సుప్రీంకోర్టు రిజిస్ట్రార్​కు కమిటీ పరిశీలన అంశాలను సీల్డ్​ కవర్​లో సమర్పిస్తుంది. జులై 18న సుప్రీం ఆదేశాల మేరకు కమిటీ నివేదికను సిద్ధంచేసింది.

కమిటీ అందించిన నివేదికపై ఆగస్టు 2న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తుంది.

ఇదీ కేసు..

అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్​, నిర్మోహి అఖాడా, రామ్​ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్​ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

ప్యానెల్​ ఏర్పాటు

ఈ వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు మార్చి 8న కీలక నిర్ణయం తీసుకుంది. వివాద శాశ్వత పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గమని తీర్మానించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్​ ఖలీఫుల్లా ఛైర్మన్​గా మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్​ న్యాయవాది శ్రీరామ్​ పంచూను సభ్యులుగా నియమిస్తూ జస్టిస్​ రంజన్ ​గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.​

ఆగస్టు వరకు పొడగింపు

నివేదిక సమర్పించేందుకు ప్యానెల్​కు 8 వారాల గడువు ఇచ్చింది. జస్టిస్​ ఖలీఫుల్లా నేతృత్వంలోని ప్యానెల్​... ఉత్తర్​ప్రదేశ్​ ఫైజాబాద్​ వేదికగా భాగస్వామ్య పక్షాలతో సమాలోచనలు జరిపింది. మొదటి దఫాలో జరిగిన చర్చల సారాంశాన్ని నివేదిక రూపంలో మే నెలలో సుప్రీంకోర్టుకు అందజేసింది.

ప్యానెల్​ అభ్యర్థన మేరకు మధ్యవర్తిత్వానికి గడువును ఆగస్టు వరకు పెంచిన కోర్టు.. ఆగస్టు 1లోపు మరో నివేదిక అందజేయాలని ఆదేశించింది.

ఇదీ చూడండి: అయోధ్య కేసు: మధ్యవర్తిత్వం కొనసాగింపు

Last Updated : Aug 1, 2019, 12:17 AM IST

ABOUT THE AUTHOR

...view details