తెలంగాణ

telangana

ETV Bharat / bharat

రాహుల్​ జమ్మూకశ్మీర్​ వెళ్లడమేంటీ:మాయావతి

ప్రతిపక్షాలు జమ్మూకశ్మీర్​ వెళ్లడాన్ని బీఎస్​పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా తప్పుబట్టారు. రాహుల్​ గాంధీ ఇతర విపక్ష నేతలతో కలిసి కశ్మీర్​ సందర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్రం రాజకీయం చేసే అవకాశం ఉందని ఆమె ఆరోపించారు.

By

Published : Aug 26, 2019, 7:07 PM IST

Updated : Sep 28, 2019, 8:47 AM IST

రాహుల్​ జమ్మూకశ్మీర్​ వెల్లడమేంటీ:మాయావతి

క్షేత్ర స్థాయిలో పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రతిపక్షాలు జమ్ముూకశ్మీర్​ వెళ్లడాన్ని తప్పుబట్టారు బహుజన్​ సమాజ్​ వార్టీ అధినేత్రి మాయావతి. ఆర్టికల్​ 370 రద్దు తర్వాత కశ్మీర్​లో సాధారణ పరిస్తితులు నెలకొనడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. అప్పటి వరకు ప్రతి పక్షాలు తొందర పడకుండా వేచి చూస్తే బాంగుండేదని ఆమె ట్వీట్​ చేశారు.

రాహుల్​పై మండిపాటు

జమ్మూ కశ్మీర్​లోని చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్​గాంధీ సహా పలువు విపక్ష నేతలు కశ్మీర్​కు వెల్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాయావతి. రాహుల్​ కశ్మీర్​ వెళ్లిన తీరును కేంద్రం రాజకీయం చేసే అవకాశాలున్నాయని ఆమె ఆరోపించారు.

అందుకే మద్దతు

మానవత్వం ఐక్యత సమగ్రతకు అంబేద్కర్​ పిలుపునిచ్చారని, కశ్మీర్​లో ఆర్టికల్​ 370ని అమలు చేయకుడదని అంబేద్కర్​ స్పష్టంగా చెప్పినట్లు మాయావతి తెలిపారు. కాబట్టి కశ్మీర్​లో స్వయం ప్రతిపత్తి రద్దుకు తమ పార్టీ మద్దతు ఇచ్చినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:టికెట్​ లేని ప్రయాణం.. రైల్వే శాఖకు తెచ్చింది లాభం!

Last Updated : Sep 28, 2019, 8:47 AM IST

ABOUT THE AUTHOR

...view details