తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'వీవీప్యాట్​ రసీదు లెక్కింపు' విచారణ వచ్చే వారం

50 శాతం వీవీప్యాట్​ స్లిప్పులు లెక్కించాలంటూ 21 విపక్ష పార్టీలు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్​ను అంగీకరించిన సుప్రీంకోర్టు... వచ్చే వారం విచారణ చేపట్టనుంది.

By

Published : May 3, 2019, 1:30 PM IST

Updated : May 3, 2019, 6:02 PM IST

'వీవీప్యాట్​ రసీదు లెక్కింపు' విచారణ వచ్చే వారం

'వీవీప్యాట్​ రసీదు లెక్కింపు' విచారణ వచ్చే వారం

వీవీప్యాట్​ స్లిప్పుల లెక్కింపుపై ఇచ్చిన తీర్పు పునఃసమీక్షించాలంటూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన రివ్యూ పిటిషన్​ను సుప్రీంకోర్టు అంగీకరించింది. పిటిషనర్ల తరపు న్యాయవాది, కాంగ్రెస్​ నేత అభిషేక్​​ మను సింఘ్వీ విజ్ఞప్తి మేరకు... వచ్చే వారం దీనిపై విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్ గొగోయి నేతృత్వంలోని ధర్మాసనం తక్షణ విచారణ జాబితాలో ఈ పిటిషన్​ ఉంది.

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో.. 21 ప్రతిపక్ష పార్టీలు ఈ పిటిషన్​ను దాఖలు చేశాయి. సార్వత్రిక ఎన్నికల్లో లెక్కించాల్సిన వీవీప్యాట్​ రసీదుల సంఖ్యను పెంచాలని కోరారు. అంతకుముందు ప్రతి నియోజకవర్గంలో 50 శాతం వీవీప్యాట్​ రసీదులను లెక్కించేలా ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విన్నవించారు. వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎన్నికల సంఘాన్ని వివరణ కోరింది.

ఈసీ అభ్యంతరం...

ప్రతి నియోజకవర్గంలో ఒక్కో వీవీప్యాట్​లోని రసీదులను లెక్కిస్తున్నామని, ఇదే సరైన పద్ధతి అని కోర్టుకు తెలిపింది ఈసీ. ప్రతిపక్షాలు కోరిన పద్దతి అనుసరించటం సాధ్యపడదని స్పష్టం చేసింది. ప్రస్తుత విధానాన్ని మార్చడానికి తగిన కారణాలను పిటిషనర్లు చూపలేకపోయారని వివరించింది.

వీటితో పాటు ప్రతిపక్షాల వాదనలు విన్న కోర్టు... నియోజకవర్గానికి 5 వీవీప్యాట్​లలోని రసీదులను లెక్కించాలంటూ ఏప్రిల్​ 8న ఈసీకి ఆదేశాలు జారీ చేసింది. అయితే సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రతిపక్షాలు మళ్లీ సుప్రీంను సంప్రదించాయి. రివ్యూ పిటిషన్​ దాఖలు చేశాయి.

Last Updated : May 3, 2019, 6:02 PM IST

ABOUT THE AUTHOR

...view details