తెలంగాణ

telangana

By

Published : Jan 23, 2020, 10:32 AM IST

Updated : Feb 18, 2020, 2:16 AM IST

ETV Bharat / bharat

రహదారి నిర్మాణ యంత్రాలను తగలబెట్టిన నక్సల్స్

ఒడిశాలో అధికార యంత్రాంగాన్ని లక్ష్యంగా చేసుకొని నక్సలైట్లు దుశ్చర్యలకు పాల్పడ్డారు. రహదారి నిర్మాణ యంత్రాలను తగలబెట్టారు. అడ్డుకున్న కార్మికులను చితకబాదారు. రహదారి నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్​ చేస్తూ పోస్టర్లు అంటించారు.

Maoists burn JCB's in Odisha
'ఒడిశాలో రహదారి నిర్మాణ యంత్రాంగాన్ని తగలబెట్టిన మావోలు'

ఒడిశా రాయ్‌గఢ్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. నియామ్‌గిరి ప్రాంతంలో రహదారి నిర్మాణం కోసం తీసుకువచ్చిన రెండు జేసీబీ యంత్రాలు, ఒక రోలర్‌, కాంక్రీట్‌ మిక్సర్​ను తగలబెట్టారు. నక్సల్స్ దుశ్చర్యలను అడ్డుకోవడానికి కార్మికులు ప్రయత్నించగా... వారిని చితకబాదారు.

రహదారి నిర్మాణాన్ని ఆపాలని అధికారులను బెదిరిస్తూ మావోయిస్టులు పోస్టర్లు అంటించారు. సమాచారం అందుకున్న భద్రతా దళాలు... ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి.

రహదారి పనులను ఆపాలని పోస్టర్లను అంటించిన మావోలు
మావోయిస్టులు నిప్పుపెట్టిన జేసీబీ
దగ్ధమైన జేసీబీ
కాలిపోయిన కాంక్రీట్​ మిక్సర్​

ఇదీ చూడండి:అమ్మభాషకు ఆలంబన.. విశిష్ట అధ్యయన కేంద్రం ఆరంభం

Last Updated : Feb 18, 2020, 2:16 AM IST

ABOUT THE AUTHOR

...view details