తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'దేశంలోని అనేక ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్య డేటా సున్నా' - Many states, union territories reported 'nil' data on farmer suicides: Home Ministry

రైతుల ఆత్మహత్యలపై కేంద్రానికి అందించే నివేదికలో గణాంకాలను 'సున్నా'గా అనేక రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చూపుతున్నాయని తెలిపారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్​రెడ్డి. రైతుల ఆత్మహత్యలపై కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ అడిగిన ప్రశ్నకు లోక్​సభ వేదికగా మంత్రి సమాధానమిచ్చారు.

Many states, union territories reported 'nil' data on farmer suicides: Home Ministry
'దేశంలోని అనేక ప్రాంతాల్లో రైతుల ఆత్మహత్య డేటా సున్నా'

By

Published : Dec 10, 2019, 11:31 PM IST

దేశంలోని అనేక రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలపై ఎలాంటి డేటా అందలేదని హోంమంత్రిత్వశాఖ పేర్కొంది. గత నాలుగేళ్లల్లో ఆత్మహత్య చేసుకున్న అన్నదాతల డేటాపై లోక్​సభ వేదికగా కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ విషయాన్ని వెల్లడించారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి.కిషన్​ రెడ్డి.

2016 నుంచి ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అన్నదాతల ఆత్మహత్యలకు సంబంధించిన వివరాలు నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో(ఎన్​సీఆర్​బీ) వద్ద ఉన్నాయా? లేవా? అని ప్రశ్నించారు వయనాడ్​ ఎంపీ రాహుల్​. 2015 నుంచి ప్రమాదవశాత్తు మరణించిన రైతుల వివరాలపై బ్యూరో ఎందుకు నివేదిక అందివ్వడం లేదని ఆరా తీశారు.

రాహుల్​ ప్రశ్నలకు స్పందిస్తూ.. రైతుల ఆత్మహత్యలు, ప్రమాదవశాత్తు మరణాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అందుతున్న వివరాలను 'ఆక్సిడెంటల్​ డెత్స్​ అండ్​ సూసైడ్స్​ ఇన్​ ఇండియా'(ఏడీఎస్​ఐ) అనే పేరుతో ఎన్​సీఆర్​బీ రిపోర్టు ప్రచురిస్తోందని గుర్తు చేశారు కిషన్​రెడ్డి​. ఈ నివేదికకు కావాల్సిన వివరాలను సకాలంలో అందివ్వాలని అన్ని ప్రాంతాలకు చెందిన ఎన్​సీఆర్​బీ విభాగాలను ఆదేశించామని స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

LOKSABHA

ABOUT THE AUTHOR

...view details