తెలంగాణ

telangana

ETV Bharat / bharat

అసోంకు ఎమ్మెల్యేలే... కానీ భారతీయులు కారు.!

జాతీయ పౌర రిజిస్టర్​ ​(ఎన్​ఆర్​సీ) తుది జాబితా శనివారం విడుదలైంది. ఇందులో అభయపురి నియోజకవర్గ ఎమ్మెల్యే, దుల్గావ్​ శాసనసభ్యునికి చెందిన నలుగురు కుటుంబ సభ్యులు, ఓ మాజీ ఎమ్మెల్యే, రక్షణశాఖ మాజీ ఉద్యోగి పేర్లు గల్లంతయ్యాయి.

By

Published : Aug 31, 2019, 4:56 PM IST

Updated : Sep 28, 2019, 11:36 PM IST

అసోం: ఎన్​ఆర్​సీలో ప్రముఖల పేర్లు గల్లంతు

అసోం జాతీయ పౌర రిజిస్టర్ ​(ఎన్​ఆర్​సీ) తుది జాబితా శనివారం విడుదలైంది. 3 కోట్ల 11లక్షల 21వేల 400 మందికి జాబితాలో చోటు లభించింది. 19 లక్షల 6వేల 657 మంది పేర్లుఎన్​ఆర్​సీ జాబితాలో లేవు. ఎన్​ఆర్​సీలో లేని వారిలో అనేక మంది ప్రముఖులు కూడా ఉండటం గమనార్హం.

కచర్ జిల్లా మాజీ ఎమ్మెల్యే కటిఘొర మౌలానా అతౌర్​ రెహ​మాన్​ మజహర్​ భూయాన్​కు ఎన్​ఆర్​సీ జాబితాలో చోటు దక్కలేదు. అభయపురికి చెందిన ఏఐయూడీఎఫ్​ ఎమ్మెల్యే అనంత మల్లా పేరు కూడా జాబితాలో లేకపోవడం వల్ల ఆయన నియోజకవర్గంలో తీవ్ర దుమారం రేగింది. దల్గావ్​ ఎమ్మెల్యే ఇలైస్​ అలి కుమార్తె సహా మరో నలుగురు కుటుంబ సభ్యుల పేర్లనూ జాబితా నుంచి తప్పించారు. ​

శనివారం విడుదలైన ఎన్​ఆర్​సీలో అనేక మంది రక్షణ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగుల పేర్లూ కనిపించలేదు. రక్షణశాఖ మాజీ ఉద్యోగి బిమల్​ చౌదరిని ఎన్​ఆర్​సీ జాబితాలో చేర్చలేదు. కానీ ఆయన కుటుంబ సభ్యులందరూ ఆ జాబితాలో ఉన్నారు.

అసలేంటీ ఎన్​ఆర్​సీ..

20వ శతాబ్దం మొదట్లో లక్షలాదిమంది బంగ్లాదేశీయులు అసోంకు వచ్చి స్థిరపడ్డారు. ముఖ్యంగా 1826 యండబో ఒప్పందం అనంతరం తూర్పు పాకిస్థాన్.. అంటే నేటి బంగ్లాదేశ్ నుంచి హిందువులు, ముస్లింలు అసోంలోకి పెద్ద ఎత్తున వలస వచ్చారు. స్వాతంత్య్రం అనంతరం కూడా ఈ ప్రక్రియ కొనసాగిన నేపథ్యంలో అసోం సంస్కృతి, భాష దెబ్బతింటోందంటూ ఆందోళనలు ప్రారంభమయ్యాయి.

ఇదీ చూడండి:- ఎన్​ఆర్​సీ జాబితాలో పేరు లేదని మహిళ ఆత్మహత్య

Last Updated : Sep 28, 2019, 11:36 PM IST

ABOUT THE AUTHOR

...view details