జపాన్ సంస్కృతిపై భారత్లో అవగాహన పెంపొందించినందుకు మణిపుర్ వైద్యుడికి 'ఆర్డర్ ఆఫ్ ది రైసింగ్ సన్' అవార్డు ప్రకటించింది ఆ దేశ ప్రభుత్వం. రెండు దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి కృషి చేసినందుకు గానూ అతడిని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది.
మణిపుర్ వైద్యుడికి జపాన్ అరుదైన గౌరవం - manipur doctor japan award
మణిపుర్కు చెందిన ఓ వైద్యుడికి 'ఆర్డర్ ఆఫ్ రైసింగ్ సన్' అవార్డును ప్రకటించింది జపాన్ ప్రభుత్వం. ఆ దేశ సంస్కృతి సంప్రదాయాలు, ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత పెంచేందుకు కృషి చేసినందుకు గాను ఆయనను ప్రశంసించింది జపాన్.

మణిపుర్ వైద్యుడికి జపాన్ అరుదైన గౌరవం
తంగ్జామ్ ధబాలి సింగ్ వృత్తిరీత్యా అల్లోపతి వైద్యుడు. మణిపుర్ టూరిజం ఫోరం (ఎమ్టీఎఫ్) వ్యవస్థాపకుడు. 2020కి గాను విదేశీ అవార్డు గ్రహీతల పేర్లు ప్రకటించేటప్పుడు సింగ్ పేరును ప్రత్యేకంగా అలంకరించింది జపాన్ ప్రభుత్వం. అవార్డుకు సబంధించిన విషయాన్ని భారత్లోని రాయబార కార్యలాయనికి లేఖ ద్వారా తెలిపింది జపాన్ .
జపనీస్ చక్రవర్తి మీజీ 1875లో 'ఆర్డర్ ఆఫ్ ది రైసింగ్ సన్'ను అవార్డును ఇవ్వడం ప్రారంభించారు.