తెలంగాణ

telangana

ఆకులతో బొగ్గు తయారీ- కార్చిచ్చు, కాలుష్యానికి చెక్​!

By

Published : Dec 29, 2019, 12:35 PM IST

హిమాచల్ ప్రదేశ్​ మండీ జిల్లా సుందర్​నగర్​లో ఓ రైతు చేసిన పని ప్రస్తుతం పలువురి ప్రశంసలు అందుకుంటోంది. తన సహచరులతో కలసి ఓ అరుదైన ఆవిష్కరణ చేశాడు ఆ వ్యక్తి. అడవులను కార్చిచ్చు నుంచి రక్షించేందుకు... ఆకులతో 'పొగ రహిత బొగ్గు'ను తయారు చేశాడు.

coal
ఆకులతో బొగ్గు తయారీ- కార్చిచ్చు, కాలుష్యానికి చెక్​!

ఆకులతో బొగ్గు తయారీ- కార్చిచ్చు, కాలుష్యానికి చెక్​!

కార్చిచ్చుల కారణంగా వేల ఎకరాల అడవులు బూడిద కావడం చూసి తట్టుకోలేకపోయాడు ఆ రైతు. అడవితల్లిని అగ్ని నుంచి కాపాడాలని అనుకున్నాడు. సహచరులతో కలిసి అనేక పరిశోధనలు చేశాడు. చివరకు విజయం సాధించాడు. హిమాచల్ ప్రదేశ్​లో జరిగిన ఈ ఆవిష్కరణకు పలువురి ప్రశంసలు అందుతున్నాయి.

మండీ జిల్లా సుందర్​నగర్​లోని ద్రమణ్ గ్రామానికి చెందిన శ్రవణ్​కుమార్... పైన్​ చెట్ల ఆకులతో ఈ బొగ్గును తయారు చేశాడు. అడవుల్లో ఆకులన్నీ ఏరేసి, ఇలా బొగ్గుగా మార్చితే... కార్చిచ్చుల ముప్పు చాలా వరకు తగ్గుతుంది. ఇంధనంగా ఉపయోగించుకోవచ్చు. మండేటప్పుడు పొగ రాకపోవడం ఈ బొగ్గు ప్రత్యేకత.

తయారీ విధానం

పొగరహిత బొగ్గు తయారీ కోసం 200 లీటర్ల నీళ్లలో 25 కిలోల పైన్ ఆకులను వేయాలి. ఇందులో మట్టి కలిపి, ఉడికించాలి. మిశ్రమం బొగ్గు రూపంలోకి మారుతుంది.

"పైన్ చెట్ల ఆకులతో నేను తయారు చేసిన ఈ బొగ్గు గృహ అవసరాలను తీరుస్తుంది. ఇది పొగ రహితమైనది. దీనిని ఉపాధి హామీ పథకం కింద తయారుచేసేందుకు అవకాశం కల్పించాలి. దీనివల్ల అడవులు తగలబడి పోవడం ఆగిపోవడమే కాదు.. వన్యప్రాణుల సంరక్షణా జరుగుతుంది."

-శ్రవణ్ ​కుమార్, ఆవిష్కర్త

రెడ్​క్రాస్ పరిశీలన

శ్రవణ్​కుమార్ చేసిన తయారుచేసిన బొగ్గును హిమాచల్ ప్రదేశ్​ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షురాలు, సీఎం జయరామ్ ఠాకూర్ సతీమణి సాధన పరిశీలించారు. ముఖ్యమంత్రితో చర్చించి ఈ వినూత్న ప్రయోగం సరైన దిశలో వెళ్లేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.

ఇదీ చూడండి: రోదశ తిప్పుదాం.. అంతరిక్షాన్ని జనహితంగా మలుద్దాం!

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details