తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్​.. చివరికి!

విడాకులు తీసుకున్న మహిళలే.. కర్ణాటకకు చెందిన సురేశ్​ టార్గెట్​​. డబ్బు కోసం వారికి వల వేయడం, అనంతరం ఆ డబ్బుతో పరారవ్వడం అతడి వృత్తి. ఇందుకు అతడు ఎంచుకున్న వేదిక మాట్రిమోనీ. అలా నాలుగు పెళ్లిళ్లు చేసుకొని, మొత్తం 23 మంది మహిళలను మోసం చేశాడు. చివరికి జైలు పాలయ్యాడు.

Man who married 4 women and cheated 23 women has arrested in Bengaluru
విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్​.. చివరికి!

By

Published : Jun 10, 2020, 11:57 AM IST

కర్ణాటకకు చెందిన సురేశ్​.. డబ్బు కోసం నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. 23 మంది మహిళలను మోసం చేశాడు. విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్​. కానీ చివరికి పోలీసులకు చిక్కాడు.

సురేశ్​

ఇలా దొరికాడు...

మైసూరుకు చెందిన సురేశ్​.. డబ్బు కోసం మహిళలను మోసం చేయడమే వృత్తిగా చేసుకున్నాడు. విడాకులు తీసుకున్న మహిళలే అతడి లక్ష్యం. మాట్రిమోనీల్లో తన ప్రొఫైల్​ పెట్టి.. మహిళలకు ఎరవేసేవాడు. తాను మంచి వాడినని నమ్మించే వాడు. తనను పెళ్లి చేసుకోమనే వాడు. అక్కడే అతడి ప్లాన్​ మొదలయ్యేది. అలా వారిని నమ్మించి.. వారి నుంచి డబ్బులు తీసుకుని పరారయ్యేవాడు.

ఇదే క్రమంలో మాట్రిమోనీలో ఓ మహిళతో సురేశ్​కు ఇటీవలే పరిచయమైంది. కొంతకాలం తరువాత... ఆమె వద్దకు పెళ్లి ప్రతిపాదన తీసుకెళ్లాడు. సొంతింటి కలలు నిజం చేసుకోవడం కోసం.. భూమిని కొనాలని, అందుకు సహాయం చేయాలని ఆ మహిళను కోరాడు. సురేశ్​ను నమ్మిన ఆమె... రూ. 10లక్షలు, 80గ్రాముల బంగారాన్ని ఇచ్చింది. అంతే ఆ తర్వాత అతడి ఫోన్​ స్విచ్ఛాఫ్​.

తాను మోసపోయానని తెలుసుకున్న మహిళ... బైదరహళ్లి పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు సురేశ్​ కోసం గాలించిన పోలీసులు.. అతడిని పట్టుకున్నారు. విచారణలో భాగంగా.. ఇప్పటి వరకు తాను నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నట్టు, 23 మంది మహిళలను మోసం చేసినట్టు అంగీకరించాడు సురేశ్​.

విడాకులు తీసుకున్న మహిళలే అతడి టార్గెట్​.. చివరికి!

ABOUT THE AUTHOR

...view details