తెలంగాణ

telangana

By

Published : Apr 7, 2020, 5:44 PM IST

Updated : Apr 7, 2020, 6:04 PM IST

ETV Bharat / bharat

'పాలు' తాగాడని కన్న కొడుకును చంపిన తండ్రి!

ఉత్తరప్రదేశ్​ ఘుంగ్​ఛాయ్​లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. తన కోసం దాచుకున్న పాలు తాగాడని కన్న కొడుకునే హతమార్చాడు ఓ తండ్రి. అనంతరం తానూ తుపాకితో కాల్చుకుని ప్రాణాలొదిలాడు.

Man shoots son, kills self over dispute on consumption of milk
'పాలు' తాగాడని కన్న కొడుకును కాల్చి చంపిన తండ్రి!

ఆస్తి కోసమో లేక డబ్బు కోసమో హత్యలు చేశారన్న వార్తలు వింటుంటారు.. కానీ 'పాల' కోసం హత్య చేయడం ఎక్కడైనా విన్నారా? అవును మీరు విన్నది నిజమే. ఉత్తర్​ప్రదేశ్​ పురాన్​పుర్​లోని ఘుంగ్​ఛాయ్​లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో 16 ఏళ్ల తన కొడుకును తుపాకితో కాల్చి తానూ ప్రాణాలొదిలాడు 55 ఏళ్ల గుర్ముఖ్​ సింగ్​ అనే వ్యక్తి.

గుర్ముఖ్​ సింగ్​ తన కోసం దాచుకున్న పాలను ఆయన పుత్రుడు జస్కరన్​ తాగడం వల్లే ఈ విషాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇదే అంశంపై ఇద్దరి మధ్య గొడవ జరుగుతుండగా.. ఆపాలని చూసిన తన తమ్ముడినీ గుర్ముఖ్​ గాయపరిచినట్లు పేర్కొన్నారు. అయితే అతను హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లడం వల్ల ప్రాణాలు దక్కించుకున్నట్లు వివరించారు.

సోమవారం రాత్రి జరిగిన ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తును ప్రారంభించారు.

Last Updated : Apr 7, 2020, 6:04 PM IST

ABOUT THE AUTHOR

...view details