దేశ ప్రజలకు చట్టంపై గౌరవం ఏ స్థాయిలో ఉందో చాటిచెప్పాడు మధ్యప్రదేశ్కు చెందిన ఓ వ్యక్తి. ఆరేళ్ల క్రితం జరిగిన ఓ కేసులో నిందితుడిగా ఉన్న అతడు... ఏకంగా 1400 కిలోమీటర్లు సైకిల్పై ప్రయాణించి పోలీసులకు లొంగిపోయాడు. అతను అంత దూరం నుంచి సైకిల్పై రావడం చూసి పోలీసులు ఆశ్చర్యానికి గురయ్యారు. పూల మాలతో స్వాగతం పలికారు.
ఏం జరిగింది?
మధ్యప్రదేశ్ ఉజ్జయిని ప్రాంతానికి చెందిన ముకేశ్ కుమార్ వివాహం చేసుకొని బిహార్లోని సీతామఢిలో స్థిరపడ్డాడు. అయితే ఆరేళ్ల క్రితం(2014లో) తన బంధువుతో జరిగిన ఘర్షణలో ముకేశ్పై కేసు నమోదయింది. ఈ మేరకు ఉజ్జయినిలోని నాగ్ఝీరి పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు. అయితే వాటికి ముకేశ్ స్పందించకపోవడం వల్ల.. అతని చిరునామా తెలుసుకున్న పోలీసులు శాశ్వత వారెంట్ను జారీ చేశారు. పోలీసు స్టేషన్కు వచ్చి కనిపించాలని పేర్కొన్నారు.