తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'పశ్చిమ బంగ పేరు మార్పు ప్రక్రియ వేగం పెంచండి' - మోదీ

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు పశ్చిమ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చే ప్రక్రియను వేగవంతం చేయాలని తన లేఖలో పేర్కొన్నారు. పేరుమార్పుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, ఈ ప్రక్రియకు రాజ్యాంగ సవరణ అవసరమౌతుందని రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ వెల్లడించిన నేపథ్యంలో లేఖ రాశారు దీదీ.

'పశ్చిమ బంగ పేరు మార్పు ప్రక్రియ వేగం పెంచండి'

By

Published : Jul 3, 2019, 8:21 PM IST

Updated : Jul 4, 2019, 5:52 AM IST

పశ్చిమ బంగ రాష్ట్రం పేరు 'బంగ్లా'గా మార్చే ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే పేరు మార్పునకు అవసరమైన రాజ్యాంగ సవరణ చేపట్టాలని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు దీదీ.

పేరు మార్పుపై ప్రభుత్వం ఇంకా అంగీకరించలేదని, రాజ్యాంగ సవరణ అవసరమౌతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్​ రాయ్ రాజ్యసభలో ప్రకటించిన అనంతరం ఈ లేఖ రాశారు మమత.

ఆంగ్లంలో వెస్ట్​ బంగాల్​గా, బెంగాలీలో పశ్చిమ్ బంగగా తమ రాష్ట్రాన్ని వ్యవహరిస్తున్నారని, గొప్ప చరిత్ర కలిగిన తమ రాష్ట్రాన్ని ఈ విధమైన పేర్లు ప్రతిబింబించవని తన లేఖలో పేర్కొన్నారు దీదీ.

2017, సెప్టెంబర్ 8వ తేదిన బంగాల్ పేరును హిందీ, ఆంగ్లం, బెంగాలీ భాషల్లో బంగ్లాగా మార్చేందుకు రాష్ట్ర శాసనసభ అంగీకారం తెలిపింది. 2018, ఆగస్టు, 21న ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది.

పేరు మార్పు ప్రక్రియను వేగవంతం చేయాలని బంగాల్ ప్రభుత్వం తరఫున ఓ లేఖను సిద్ధం చేశారు. ఈ లేఖను గురువారం కేంద్రానికి పంపించనున్నారు.

ఇదీ చూడండి: 120 ఏళ్ల సంప్రదాయం.. పోస్ట్​ఉమెన్ పడవ ప్రయాణం

Last Updated : Jul 4, 2019, 5:52 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details