తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భూ వివాదంలో అమర్త్యసేన్‌కు అండగా మమత - అమర్త్యసేన్​కు లేఖ రాసిన మమత

భూ వివాదం విషయంలో ఆర్థిక నిపుణుడు అమర్త్యసేన్​కు అండగా నిలిచారు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. విశ్వభారతికి చెందిన భూమిని ఆక్రమించారంటూ సేన్​పై వస్తోన్న ఆరోపణలను కొట్టిపారేశారు. సేన్​కు అండగా ఉంటానని తెలుపుతూ శుక్రవారం లేఖ రాశారు.

Mamata writes letter to Amartya Sen and assures support on house controversy
భూ వివాదంలో అమర్త్యసేన్‌కు అండగా మమత

By

Published : Dec 26, 2020, 8:40 AM IST

నోబెల్‌ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌ కొంత భూమిని ఆక్రమించారంటూ వస్తున్న ఆరోపణలకు సంబంధించి ఆయనకు బంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అండగా నిలిచారు. ఈ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని కొట్టిపారేశారు. అసహనం, నిరంకుశత్వానికి వ్యతిరేకంగా చేస్తోన్న పోరాటంలో తనను సోదరిగా భావించాలంటూ అమర్త్యసేన్‌కు ఆమె శుక్రవారం లేఖ రాశారు.

శాంతినికేతన్‌లోని సేన్‌ నివాసంలో కొంత భాగం.. విశ్వభారతికి చెందిందిగా కొందరు ఆరోపించడాన్ని మమత కొట్టిపారేశారు. భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లపై మమత పరోక్షంగా విమర్శలు చేశారు. భాజపాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నందునే సేన్‌ను వారు లక్ష్యంగా చేసుకొని వివాదాలు సృష్టిస్తున్నట్లు విమర్శించారు.

అమర్త్యసేన్​కు లేఖ రాసిన మమతా బెనర్జీ

"మీపై వస్తున్న ఆరోపణల పట్ల నాకు చాలా బాధ కలిగింది. మత దురభిమానులపై మీరు చేస్తోన్న యుద్ధానికి నేను సంఘీభావం తెలుపుతున్నాను. ఈ విషయంలో నన్ను మీ సోదరిగా భావించండి. మీకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది" అని లేఖలో మమత రాశారు.

ఇదీ చదవండి:అసెంబ్లీ ఎన్నికలకు ముందు అసోం పర్యటనలో షా

ABOUT THE AUTHOR

...view details