తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'నిరూపించకుంటే మోదీ వంద గుంజీలు తీయాలి'

తృణమూల్​ కాంగ్రెస్​ నేతలపై ప్రధాని మోదీ ఆరోపణలను తిప్పికొట్టారు మమతా బెనర్జీ. మోదీ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఆరోపణలను నిరూపిస్తే వెంటనే తన 42 మంది లోక్​సభ అభ్యర్థులను ఎన్నికల నుంచి ఉపసంహరింపజేస్తామన్నారు. నిరూపించడంలో విఫలమైతే చెవులు పట్టుకుని మోదీ వంద గుంజీలు తీయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : May 9, 2019, 8:32 PM IST

'నిరూపించకుంటే మోదీ వంద గుంజీలు తీయాలి'

మోదీ ఆరోపణలపై మమత ఘాటు స్పందన

బంగాల్​లో మంగళవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ... తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీ నేతలు అక్రమ బొగ్గు గనుల తవ్వకాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తాజాగా మోదీ విమర్శలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఘాటుగా స్పందించారు.

తమ నాయకుల్లో ఏ ఒక్కరైన అవినీతికి పాల్పడ్డట్టు నిరూపిస్తే... 42 లోక్​సభ స్థానాల్లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థులను ఉపసంహరించుకుంటానని వెల్లడించారు. ఆరోపణలను నిరూపించలేకపోతే ప్రధాని చెవులు పట్టుకుని వంద గుంజీలు తీయాలన్నారు.

భాజపాకు చెందిన వ్యక్తులే అక్రమ బొగ్గు గనుల తవ్వకాలకు పాల్పడుతున్నారని విమర్శించారు మమత. ఈ అక్రమాలపై తన వద్ద ఓ పెన్​డ్రైవ్​ ఉందని, అది ప్రజలకిస్తే ఎన్నో నిజాలు బయటపడతాయని తెలిపారు.

ఇదీ చూడండి:'యువ క్రికెటర్లలో పంత్ గొప్ప ఫినిషర్'

ABOUT THE AUTHOR

...view details