బంగాల్ రాష్ట్ర ఇన్పర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) విభాగం సరికొత్త డాక్యుమెంట్ స్కానింగ్ యాప్ 'సెల్ఫ్ స్కాన్'ను అభివృద్ధి చేసింది. సోమవారం ఆ యాప్ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ యాప్ దేశభక్తికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.
చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ల నేపథ్యంలో ఇటీవలే 59 డ్రాగన్ దేశ యాప్లను నిషేధించింది కేంద్రం. వాటిలో డాక్యుమెంట్ స్కానింగ్కు ఉపయోగించే క్యామ్స్కానర్ ఒకటి. ఈ నిర్ణయం తీసుకున్న కొద్ది రోజులకే బంగాల్ ప్రభుత్వం సెల్ఫ్ స్కాన్ యాప్ను ఆవిష్కరించటం ప్రాధాన్యం సంతరించుకుంది.