తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మాల్యా అప్పగింత... స్వాగతించిన భారత్​

మాల్యాను భారత్​కు అప్పగించాలన్న బ్రిటన్​ ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

By

Published : Feb 5, 2019, 7:25 AM IST

విజయ్​ మాల్యా

విజయ్​ మాల్యాను అప్పగించాలని బ్రిటన్ తీసుకున్న​ నిర్ణయాన్ని భారత్​ స్వాగతించింది. చట్టపరమైన చర్యల పూర్తి కోసమే వేచిచూస్తున్నామని ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారి తెలిపారు.

ఈ పరిణామంపై అరుణ్​జైట్లీ ట్విట్టర్​ వేదికగా స్పందించారు. మాల్యాను రప్పించటంలో మోదీ ప్రభుత్వం ముందడుగు వేసిందని.. అదే సమయంలో ప్రతిపక్షాలు శారదా కుంభకోణం ... నిందితుల చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు.

అప్పీలుకు 14 రోజుల గడువు...

బ్రిటన్​ ప్రభుత్వ నిర్ణయంపై ఫిబ్రవరి 4 నుంచి 18 వరకు అక్కడి హైకోర్టులో మాల్యా అప్పీలు చేసుకోవచ్చు.

బ్యాంకు రుణాల ఎగవేతతో పాటు విజయ్​ మాల్యా మనీ లాండరింగ్ నేరారోపణలను ఎదుర్కొంటున్నారు. ఇతని అప్పగింత ఆదేశాలపై పాకిస్థాన్​ మూలాలున్న బ్రిటన్​ హోం మంత్రి సాజిద్​ జావిద్​ ఆదివారం నాడు సంతకం చేశారు. దీనిని సోమవారం నాడు ఆ శాఖ అధికారులు ధృవీకరించారు.

ABOUT THE AUTHOR

...view details