మహారాష్ట్ర, పాల్ఘర్ జిల్లా తారాపుర్ కెమికల్ జోన్లోని ఓ రసాయన పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు-ఇద్దరు మృతి సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో నందోలియా ఆర్గానిక్ కెమికల్స్ ప్రైవేటే లిమిటెడ్ పరిశ్రమలో.. భారీ పేలుడు జరిగింది. ఆ శబ్ధాలు దాదాపు 10 కి.మీ. మేర వినిపించాయి. తారాపుర్ సహా సాల్వడ్, పాస్థల్, బోయీసర్, చించానీ, నందగావ్ గ్రామాలు పేలుడు ధాటికి ప్రభావితమయ్యాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు.
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు-ఇద్దరు మృతి పేలుడు సమయంలో పరిశ్రమలో పని చేస్తున్న 20 మంది కార్మికుల్లో14 మంది ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సందీప్ కుష్వాహ, గ్రిజేశ్ మౌర్య ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు-ఇద్దరు మృతి కంపెనీ నిర్వాహకుల్లో ఒకరైన సందీప్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం 'డిక్లోరో బెంజమైడ్ అజోల్' అనే రసాయన మిశ్రమంలో మోతాదుకు మించిన నీటిని కలపడం వల్లే.. ఈ ప్రమాదం సంభవించింది.
ఇదీ చదవండి: బయోకాన్ చీఫ్ 'కిరణ్ మజుందర్ షా'కు కరోనా