తెలంగాణ

telangana

By

Published : Oct 24, 2019, 10:00 AM IST

ETV Bharat / bharat

'మహా'పోరు: ఆధిక్యంలో కమలదళం.. కానీ..

మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపులో అధికార పక్షం ఆధిక్యం కనబరుస్తోంది. అయితే... విపక్ష కాంగ్రెస్​-ఎన్​సీపీ కూటమి ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను మించి జోరు కనబరుస్తోంది.

'మహా'పోరు: ఆధిక్యంలో కమలదళం.. కానీ..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముమ్మరంగా సాగుతోంది. భాజపా-శివసేన కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. కాంగ్రెస్​-ఎన్సీపీ కూటమి ఊహించినదానికన్నా ఎక్కువ స్థానాల్లో జోరు కనబరుస్తోంది. తుది ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

శాసనసభ ఎన్నికలు ఈనెల 21న ముగిసిన అనంతరం ఎగ్జిట్​ పోల్స్​ భాజపాకే పట్టం కట్టాయి. భారీ మెజారిటీ సాధిస్తుందని తేల్చాయి. కానీ ఓట్ల లెక్కింపును పరిశీలిస్తే ఎగ్జిట్​ పోల్స్​ తేల్చినంత ఏకపక్షంగా ఫలితాలు ఉండబోవనేది స్పష్టంగా తెలుస్తోంది.

ఇదీ చూడండి: రిజల్ట్స్​ లైవ్​ : రెండు రాష్ట్రాల్లోనూ భాజపా ముందంజ

ABOUT THE AUTHOR

...view details