తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్ర: పుణెలో గోడ కూలి ఐదుగురు మృతి - maharastra news

మహారాష్ట్ర పుణెలో భారీ వర్షం కారణంగా గోడ కూలి ఐదుగురు మృతి చెందారు. వేర్వేరు ఘటనల్లో మొత్తం ఏడుగురు మరణించారు.

మహారాష్ట్రలో గోడ కూలి ఐదుగురు మృతి

By

Published : Sep 26, 2019, 8:43 AM IST

Updated : Oct 2, 2019, 1:27 AM IST

పుణెలో గోడ కూలి ఐదుగురు మృతి

మహారాష్ట్ర పుణెలో ఘోర ప్రమాదం సంభవించింది. అరణ్యేశ్వర్​లో భారీ వర్షం కారణంగా గోడ కూలిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మృతుల్లో ఒక చిన్నారి కూడా ఉంది.

ప్రమాద స్థలానికి హుటాహుటిన చేరిన ఎన్​డీఆర్​ఎఫ్​ బృందం సహాయక చర్యలు చేపట్టింది. మరో రెండు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. సహకార్​ నగర్​లో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. సింఘార్​ రోడ్డులో కొట్టుకువచ్చిన ఓ కారులో మరో మృతదేహాన్ని ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది గుర్తించారు.

పుణె జిల్లాలో రెండురోజులుగా భారీగా వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో పురందర్​, బారామతి, భోర్​, హవేలిలో మండలాల్లోని విద్యాసంస్థలకు కలెక్టర్ నావల్ కిషోర్ రామ్ సెలవు ప్రకటించారు.

ఇదీ చూడండి: మృత్యువు అంచుల వరకు వెళ్లి బతికాడు!

Last Updated : Oct 2, 2019, 1:27 AM IST

ABOUT THE AUTHOR

...view details