తెలంగాణ

telangana

By

Published : Dec 16, 2020, 3:41 PM IST

ETV Bharat / bharat

ఐఎన్​ఎస్​ విరాట్​ విచ్ఛిన్నంపై వివాదం!

భారత రక్షణ రంగంలో అత్యంత ఎక్కువ కాలం సేవలందించిన నౌక ఐఎన్​ఎస్​ విరాట్ విచ్ఛిన్నంపై పెద్ద దూమారమే రేగింది. విరాట్​ విచ్ఛిన్న ప్రక్రియను నిలిపివేసి మ్యూజియంగా మార్చాలని రక్షణ శాఖకు లేఖ రాశారు మహారాష్ట్ర ఎంపీ ప్రియాంకా చతుర్వేది.

Maharashtra MP raises demand: Ship breaker challenges to conduct survey on the spot
ఐఎన్​ఎస్​ విరాట్​ విచ్చిన్నంపై వివాదం!

దీర్ఘకాలం రక్షణ రంగంలో సేవలందించిన నౌక ఐఎన్ఎస్​ విరాట్​ విచ్ఛిన్నంపై పెద్ద వివాదం చెలరేగింది. గుజరాత్​లోని అలంగ్​ తీర ప్రాంతంలో నౌకను విచ్ఛిన్నం చేసే ప్రక్రియను ప్రారంభించింది శ్రీరామ్​ గ్రూప్​ సంస్థ. అయితే 'విరాట్​' విచ్ఛిన్న ప్రక్రియను తక్షణమే నిలిపేవేయాలంటూ రక్షణ శాఖకు లేఖ రాశారు మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది. నౌకను గోవా తీరంలో ఉంచి మ్యూజియంగా మార్చేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని పేర్కొన్నారు.

ఐఎన్​ఎస్​ నౌక
విరాట్ ముందు భాగాన్ని తొలగించిన చిత్రం

అయితే నౌకను కావాలనుకున్నవారు వచ్చి సర్వే చేసుకోవాలని సూచించింది శ్రీరామ్​ గ్రూప్​ సంస్థ.

నౌకను విచ్ఛిన్నం చేస్తున్న సిబ్బంది
విరాట్​ విడిభాగం

తమ సొంత ప్రయోజనాల కోసం రాజకీయ, సామాజిక నేతలు కలిసి ఐఎన్​ఎస్ విరాట్​ను రాజకీయం చేస్తున్నారని నౌక యజమాని ముకేశ్​భాయ్​ పటేల్​ అన్నారు. ఇప్పటివరకు విరాట్​ గురించి లిఖితపూర్వకంగా గానీ మాటలద్వారా గానీ ఎవరూ ప్రస్తావించలేదన్న ఆయన.. నౌకను విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు వివాదం సృష్టిస్తున్నారని పేర్కొన్నారు.

విరాట్ ముందు భాగాన్ని తొలగించిన చిత్రం
నౌక విడిభాగం

ఇదీ చూడండి:'రూ.100 కోట్లకు ఐఎన్​ఎస్​ విరాట్ అమ్మకం'

ABOUT THE AUTHOR

...view details