మహారాష్ట్రలో.. బీమా కింద ఓ కంపెనీ అమరావతి జిల్లా రైతుకు 4.35 రూపాయలు చెల్లించింది. దీనితో ఆ రైతు తీవ్ర దిగ్భ్రాంతి చెందాడు. మోసపోయానంటూ కన్నీరు పెట్టుకున్నాడు.
ఆశలు పెట్టుకుని...
70ఏళ్ల సాహెబ్రావ్ ధాలే రిధ్పుర్ గ్రామవాసి. ఆయనకు 5 ఎకరాల పొలం ఉంది. 2019లో రెండు పంటలు(పత్తి, సోయాబీన్) వేశాడు. వీటికి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద రూ. 900 చెల్లించి బీమా తీసుకున్నాడు.
అయితే గతేడాది మహారాష్ట్రను అకాల వర్షాలు కుదిపేశాయి. వేలాది ఎకరాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో పంట చేతికందకపోవడం వల్ల.. ఆశలన్నీ బీమా మీదే పెట్టుకున్నాడు. కానీ ఆ కంపెనీ మాత్రం రైతుకు రూ. 4.35 ఇచ్చి పంపించింది. బీమా సంస్థ తనను మోసం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు సాహెబ్రావ్.