మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ(భాజపా) సీనియర్ నాయకుడు ఏక్నాథ్ ఖాడ్సే.. ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు కాషాయం పార్టీని వీడినట్టు రాష్ట్ర మంత్రి, ఎన్సీపీ చీఫ్ జయంత్ పాటిల్ తెలిపారు. ఏక్నాథ్.. ఈ శుక్రవారం(23వ తేదీ) మధ్యాహ్నం 2 గంటలకు లాంఛనప్రాయంగా ఎన్సీపీలో చేరనున్నారని చెప్పారు పాటిల్.
మహారాష్ట్రలో భాజపాకు షాక్- ఎన్సీపీ గూటికి సీనియర్ నేత - ఎన్సీపీలో చేరిన మహారాష్ట్ర భాజపా నాయకుడు ఏక్నాథ్ ఖాద్సే
మహారాష్ట్రలో భాజపా సీనియర్ నాయకుడు ఏక్నాథ్ ఖాడ్సే ఆ పార్టీని వీడారు. ఆయన త్వరలోనే ఎన్సీపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు తెలుస్తోంది.
భాజపాను వీడి ఎన్సీపీ తీర్థం పుచ్చుకున్న ఏక్నాథ్ ఖాడ్సే
అవినీతి ఆరోపణల్లో భాగంగా.. 2016లో అప్పటి సీఎం దేవేంద్ర ఫడణవీస్ నేతృత్వంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు ఏక్నాథ్. నాటి నుంచి ఆయన పార్టీపై అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఇదీ చదవండి:ఫడణవీస్, రౌత్ల రహస్య భేటీతో వేడెక్కిన 'మహా' రాజకీయం