తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'50-50' డిమాండ్​పై వెనక్కు తగ్గేది లేదు: సేన - SAMANA ABOUT BJP

మహారాష్ట్రలో '50-50' సూత్రంపై వెనక్కి తగ్గేది లేదని శివసేన స్పష్టం చేసింది. సీఎం పదవి డిమాండ్​ను ఉపసంహరించుకున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పారు ఆ పార్టీ నేత సంజయ్​ రౌత్.

MH-SENA-RAUT

By

Published : Oct 31, 2019, 3:36 PM IST

'50-50' ఫార్ములాపై శివసేన వెనక్కి తగ్గిందని వస్తున్న వార్తలను ఖండించారు ఆ పార్టీ నేత, ఎంపీ సంజయ్​ రౌత్. కొన్ని వార్తాసంస్థలు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారంగా అభివర్ణించారు.

"పదవి పంచుకోవటంపై శివసేన వెనక్కితగ్గిందన్న వార్తలు అవాస్తవం. ఇది కొన్ని వర్గాలకు చెందిన మీడియా సంస్థలు చేస్తున్న ప్రచారం మాత్రమే. ప్రజలకు అంతా తెలుసు. భాజపా, సేన మధ్య తీసుకున్న నిర్ణయాన్ని బట్టి... ప్రభుత్వ ఏర్పాటు ఉంటుంది."

-సంజయ్​ రౌత్​, శివసేన ఎంపీ

భాజపాలోకి సేనకు చెందిన 23 ఎమ్మెల్యేలు చేరుతారన్న వార్తలను కూడా రౌత్ ఖండించారు. అలాంటిదేమీ లేదని స్పష్టం చేశారు.

సామ్నాలోనూ..

శివసేన అధికారిక పత్రిక సామ్నా కూడా ఇదే రీతిలో స్పందించింది. చెరిసగం అధికారం అనే డిమాండ్​ నుంచి వెనక్కి తగ్గలేదని స్పష్టం చేసింది. 'మిత్రపక్షంతో అవసరం నిమిత్తం' అనే ధోరణిలో భాజపా వ్యవహరిస్తోందని ఆరోపించింది.

ABOUT THE AUTHOR

...view details