తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహారాష్ట్రలో మోదీ బిజీ బిజీ.. 4 రోజులు.. 9 ర్యాలీలు

చైనా అధ్యక్షుడి పర్యటన అనంతరం ప్రధాని నరేంద్రమోదీ మరింత బిజీ కానున్నారు. ఈ నెల 21న మహారాష్ట్రలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తీరిక లేకుండా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొననున్నారు. రాష్ట్రంలో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు కేవలం నాలుగు రోజుల్లోనే తొమ్మిది సభల్లో ప్రసంగించనున్నారు ప్రధాని.

By

Published : Oct 12, 2019, 7:05 AM IST

Updated : Oct 12, 2019, 7:18 AM IST

మహారాష్ట్రలో మోదీ బీజీ బీజీ.. 4 రోజులు.. 9 ర్యాలీలు

మహారాష్ట్రలో మరోసారి అధికారపీఠాన్ని అధీష్టించేందుకు భాజపా వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని నరేంద్రమోదీతో నాలుగు రోజుల్లో తొమ్మిది ఎన్నికల ర్యాలీలు నిర్వహించనుంది. ఈ నెల 21న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 18వ తేదీన ముంబయిలో ఓటర్లనుద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తెలిపారు.

" ఆదివారం భందారా జిల్లాలోని జల్​గావ్​, సకోలీ ప్రాంతాల్లో జరగనున్న ర్యాలీల్లో ప్రధాని పాల్గొంటారు. 16వ తేదీన అకోలా, పన్వేల్​, పార్తూర్​ సభల్లో మోదీ ప్రసంగిస్తారు. ఆ తర్వాతి రోజున పుణె, పర్లీలో ఓటర్లనుద్దేశించి ప్రధాని మాట్లాడతారు."
- స్మృతి ఇరానీ, కేంద్రమంత్రి

ఫడనవీస్​ ప్రభుత్వం భేష్​..

మహారాష్ట్రలో రైతులకోసం ఫడనవీస్​ ప్రభుత్వం చాలా చేస్తోందని కొనియాడారు ఇరానీ. ఐదేళ్ల పరిపాలనలో వ్యవసాయరంగానికి రూ.1.5లక్షల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. రైతుల పంట రుణాలు మాఫీ చేయడానికి భాజపా సర్కారు రూ.21,950 కోట్లు విడుదల చేసిందన్నారు. గత కాంగ్రెస్​, ఎన్సీపీ ప్రభుత్వాలు 15 ఏళ్లలో కేవలం రూ.7,500 కోట్లు మాత్రమే మాఫీ చేశాయన్నారు కేంద్రమంత్రి.

ఇదీ చూడండి : ఆసక్తికరంగా జిన్​పింగ్ తొలిరోజు పర్యటన

Last Updated : Oct 12, 2019, 7:18 AM IST

ABOUT THE AUTHOR

...view details