తెలంగాణ

telangana

By

Published : Nov 23, 2019, 5:10 AM IST

Updated : Nov 23, 2019, 7:56 AM IST

ETV Bharat / bharat

'మహా' ప్రభుత్వ ఏర్పాటుపై నేడూ సాగనున్న చర్చలు

మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నేడూ చర్చలు జరగనున్నాయి. కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన నేతలు సమావేశంకానున్నారు. అనంతరం గవర్నర్​ను కలవడం సహా పలు కీలక అంశాలపై ప్రకటన విడుదల చేసే అవకాశముంది.

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుపై నేడూ చర్చలు

చర్చలు, సంప్రదింపులు, సమావేశాలతో కొన్ని రోజులుగా తీరిక లేకుండా గడుపుతున్న కాంగ్రెస్​-ఎన్​సీపీ-శివసేన నేతలు నేడూ భేటీకానున్నారు. ప్రభుత్వం ఏర్పాటు సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం మూడు పార్టీల నేతలు మీడియా ముందుకు రానున్నారు.

అనిశ్చితి...

రాష్ట్రంలో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్​ ఠాక్రే నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పడుతుందని ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​ ఇప్పటికే ప్రకటించారు. కానీ ఠాక్రే ఎంత కాలం ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే అంశంపై అస్పష్టత నెలకొంది. దీనితో పాటు కనీస ఉమ్మడి ప్రణాళిక, పదవుల పంపకాల సమస్య ఇంకా కొలిక్కి రాలేదు. నేటి భేటీలో వీటిపై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారని రాజకీయ వర్గాల సమాచారం. గవర్నర్‌ను కలిసే అంశంపైనా నేడు స్పష్టత వచ్చే అవకాశముంది.

'సేన డిమాండ్​కు భాజపా ఒప్పుకోవాల్సింది'

మహారాష్ట్రలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులపై స్పందించారు కేంద్రమంత్రి రామ్​దాస్​ అఠవాలే. శివసేన 50-50 ఫార్ములాకు భాజపా అంగీకరించి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. అప్పుడు అధికారం కమల దళం చేతి నుంచి జారేది కాదన్నారు. ఇరు పార్టీల మధ్య మైత్రి కొనసాగేదని తెలిపారు.

అక్టోబర్​లో జరిగిన ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకుభాజపా-శివసేన కూటమికి మెజారిటీ లభించింది. కానీ ముఖ్యమంత్రి పీఠంపై విభేదాలు ఏర్పడి కమల దళంతో విడిపోయిన సేన.. కాంగ్రెస్​-ఎన్​సీపీ కూటమితో చేతులు కలిపింది.

Last Updated : Nov 23, 2019, 7:56 AM IST

ABOUT THE AUTHOR

...view details