మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు చివరి అంకానికి చేరుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ భగత్సింగ్ కోషియారీ భాజపాను ఆహ్వానించారు. గవర్నర్ నిర్ణయంతో.. భాజపా తదుపరి వ్యూహరచనపై దృష్టి సారించింది. ప్రభుత్వ ఏర్పాటు, బలనిరూపణకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు భాజపా కోర్ కమిటీ ఇవాళ భేటీ కానుంది. ప్రభుత్వ ఏర్పాటు సమయం, విశ్వాస పరీక్షకు అవసరమైన బలం సంపాదించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.
సోమవారమే విశ్వాస పరీక్ష..
విశ్వాస పరీక్షకు గవర్నర్ విధించిన గడువు సోమవారమే కావడం వల్ల ఒక్క రోజు వ్యవధిలో బలనిరూపణ ఏ మార్గంలో పూర్తి చేయాలన్న అంశంపై ఇవాళ్టి కోర్కమిటీలో భాజపా వ్యూహరచన చేయనుంది.